నేడు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం.. మంత్రి పదవులపై ఆసక్తి..

  • IndiaGlitz, [Monday,November 16 2020]

బిహార్ నూతన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌‌ విషయమై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎంత మందికి చోటు దక్కుతుంది? ఏ ఈక్వేషన్‌లో ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలకు ఎన్ని పదవులు ఇస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాగా.. నితీశ్ తన కేబినెట్‌లోకి 16 నుంచి 17 మందిని తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. జేడీయూ, బీజేపీ నుంచి ఏడుగురు చొప్పున కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఏన్డీయే భాగస్వామ్య పార్టీలైన హిందుస్థాని అవామీ మోర్చా-సెక్యులర్, వికాశీల్ ఇన్సాన్ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేబినెట్‌లో స్థానం దక్కనున్నట్టు సమాచారం.

ప్రతి 7 సీట్లకు రెండు స్థానాలు..

కాగా.. గెలిచిన సీట్లను బట్టే బెర్త్‌ల సంఖ్య ఉంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు సాధించగా.. జేడీయూ 43 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతి 7 సీట్లకు రెండేసి చొప్పున మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే బీజేపీ నుంచి 18 మందికి.. జేడీయూ నుంచి 12 మందికి కేబినెట్‌లో స్థానం దక్కనుంది. కాగా.. బిహార్‌లో 243 నియోజకవర్గాలున్నాయి. ఈ విధంగా చూస్తే కేబినెట్‌లో భర్తీ చేసే స్థానాల సంఖ్య 15 శాతానికి మించరాదు. కాబట్టి బిహార్ కేబినెట్‌లో గరిష్టంగా 36 మందికి మాత్రమే అవకాశముంది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి 16 నుంచి 17 స్థానాలను భర్తీ చేసి.. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసి మరికొందరికి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది.

ఉప ముఖ్యమంత్రి ఎవరు?

కాగా.. ఉప ముఖ్యమంత్రి ఎవరనేదే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్థానంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను బీజేపీ నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా.. తాజాగా సుశీల్ మోదీ తన ట్వీట్‌లో తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనకు చాలా ఇచ్చాయని, భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా శక్తిమేరకు పనిచేసేందుకు సిద్ధమేనని తెలిపారు. ఈ ట్వీట్‌ను చూసిన వారంతా సుశీల్ మోదీకి మరోసారి డిప్యూటీ సీఎం పదవి కష్టమేననే భావన కలుగుతోంది. మరోవైపు సుశీల్ మోదీని రాజ్యసభకు పంపి, అనంతరం కేంద్ర కేబినెట్‌లో తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

More News

మరోసారి బాలయ్య అతిథి పాత్ర చేస్తారా?

నటసింహ నందమూరి బాలకృష్ణ గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తారా? అంటే ఎందుకు నటించరని ఆయన అభిమానులు ఎదురు ప్రశ్నిస్తారు.

గుడిలో దేవుడి ముందు మోకరిల్లి అలాగే ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే..

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ధన్‌తేరాస్ సందర్భంగా ఆలయానికి వెళ్లి పూజ చేస్తూ దేవుడికి శిరస్సు వంచి ప్రణామం చేసి అలాగే కిందపడిపోయారు.

23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్: కేసీఆర్

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌ సీఎంను కొరడాతో కొట్టిన వృద్ధుడు.. ఫోటోలు వైరల్

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేయి వేయాలంటే ఎంత గట్స్ ఉండాలి? అసలు సీఎం వరకూ ఓ సామాన్యుడు వెళ్లగలడా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్..

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కాలంలో ఆర్టీసీ ఉద్యోగులకు 50 శాతం వేతనాన్ని మాత్రమే చెల్లించారు.