గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న మ్యాచో హీరో గోపీచంద్‌కు ప్ర‌స్తుతం మార్కెట్ వేల్యూ లేకుండా పోయింది. ఆయ‌న గ‌త చిత్రం 'చాణ‌క్య‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస‌ర్ట్ కావ‌డంతో గోపీచంద్‌తో సినిమా అంటే నిర్మాత‌లు ఆలోచించుకుంటున్నారు. అందుకేనేమో చాణ‌క్య విడుద‌ల‌కు ముందు సీనియ‌ర్ నిర్మాత గోపీచంద్‌తో ఓ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించాడు. చాణ‌క్య ప్లాప్ కావ‌డంతో ఆయ‌న సినిమాను ఆట‌కెక్కించేశాడు.

ఇప్పుడు గోపీచంద్ ఏం చేయ‌లేక త‌న ఫోకస్‌ను సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమాపై పెట్టాడు. త‌న సినిమా నిర్మాత‌ల‌కు లాభం సంగ‌తేమో కానీ.. న‌ష్టం రాకూడ‌ద‌ని అనుకున్న గోపీచంద్ ఓ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో గుస గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకోస‌మ‌ని త‌న సినిమా నిర్మాణ ఖర్చులు త‌గ్గించుకోవాల‌ని భావించాడ‌ట‌. అందుకోస‌మ‌ని రెమ్యున‌రేష‌న్స్ లేకుండా సినిమా చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ని టాక్‌.

హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి మ‌ధ్య‌లో విల‌న్‌గా మారి, త‌ర్వాత హీరోగా మారిన గోపీచంద్ మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాడు. అయితే కొంత కాలంగా ఈ హీరోకి బాక్సాఫీస్ వ‌ద్ద హిట్స్ లేవు. ఇప్పుడు గోపీచంద్ త‌న ఆశ‌ల‌న్నీ సంపత్ సినిమాపైనే పెట్టుకున్నాడు. మ‌రి సంప‌త్ నంది ఏం చేస్తాడో చూడాలి.

More News

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

హైదరాబాద్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్.

చిరు మైత్రీతో చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం .. ఆమెపై రెండు, మూడు బ‌యోపిక్స్‌ను ద‌ర్శక నిర్మాతు అనౌన్స్ చేశారు.

మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

‘కలాం’ స్థానంలో ‘వైఎస్’ పేరు.. సీఎం జగన్ సీరియస్!

మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డా. అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోర అవమానం చేసిందని గత కొన్ని గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.