మ‌రోసారి సాయితేజ్ సినిమాలో..

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

గ‌త ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్. ఇప్పుడు ఈ మెగాక్యాంప్ హీరో 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తి కాకుండానే మ‌రో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. వాటిలో ఒకటి దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనుండగా... మరొకటి వీరు పోట్ల డైరెక్షన్ లో రూపొందనుంద‌ని టాక్‌. ఈ రెండింటిలో దేవా కట్టా సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళుతుందని తెలిసింది. అంతేకాదు... ఇందులో కథానాయికగా త‌మిళ పొన్ను నివేదా పేతురాజ్ ఎన్నికైంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సాయితేజ్‌తో కలసి నటించడం నివేదా పేతురాజ్ కి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే చిత్రలహరిలో న‌టించింది. కాకపోతే.. ఆ సినిమాలో తనది నాయిక పాత్ర కాదు. కానీ, మెసెజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందనున్న దేవా కట్టా చిత్రంలో మాత్రం నివేదానే లీడింగ్ లేడీ అట. మెగా కాంపౌండ్‌లో నివేదా నటించిన 'చిత్రలహరి', 'అల వైకుంఠపురములో' మంచి ఫలితాలనే అందుకున్న నేపథ్యంలో... కొత్త చిత్రం కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.

More News

బీజేపీలో చేరిన సింధియా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం నాడు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే..

ఇద్ద‌రిలో ప‌వ‌న్‌తో చేసెదెవ‌రు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో

సినిమా కోసం హ‌నీమూన్ వాయిదా!!

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ ప్ర‌స్తుతం పెళ్లి కంటే సినిమా మూడ్‌లోనే ఉన్న‌ట్లున్నాడు. `అర్జున్ సుర‌వరం` స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్ `కార్తికేయ2`

ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ ముహూర్తం కుదిరింది

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో

‘మ‌ధ’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా