'మెగా' తప్పిదానికి క్షమాపణ చెప్పిన ఒటిటి సంస్థ

  • IndiaGlitz, [Friday,January 01 2021]

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు కామన్‌గానే ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీంతో ‘ఆహా’ పలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలకు కూడా శ్రీకారం చుట్టింది. వాటిలో సమంత హోస్ట్‌గా చేస్తున్న ‘సామ్ జామ్’ ఒకటి. ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేశారు. ఈ షో మిగిలిన షోలకు చాలా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు సైతం బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ షోలో ఓ తప్పిదం జరిగింది. అంతే ఈ షో విషయమై ఓ రేంజ్‌లో రచ్చ జరిగింది. దీంతో ‘ఆహా’ తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పుకోక తప్పలేదు.

అసలు ఏం జరిగిందంటే తాజాగా ఈ షోకి అల్లు అర్జున్ వచ్చాడు. ఈ షో ప్రమోషన్‌లో భాగంగా ‘మెగాస్టార్ అల్లు అర్జున్’ అని పేర్కొన్నారు. అంతే మెగాస్టార్ అభిమానులు మండిపడ్డారు. నెట్టింట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో తప్పు తెలుసుకున్న ‘ఆహా’ యాజమాన్యం దిగిరాక తప్పలేదు. మెగాస్టార్ అభిమానులకు క్షమాపణ చెప్పుకోక తప్పలేదు.‘‘మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించినందునే మేము చాలా చక్కగా రాణించగలుగుతున్నాం. అయితే ఈ ఏడాది చివరలో మా కారణంగా అనుకోని తప్పిదం జరిగింది. దాని కారణంగా మీరు మమ్మల్ని ఆదరించడం మానేయరని మాకు తెలుసు. మేము చేసిన తప్పిదం కారణంగా బాధపడిన ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నాం. ఇండస్ట్రీలో ఒకే ఒక్క మెగాస్టార్ ఉన్నారు. ఆయనెవరో మనందరికీ తెలుసు’’ అంటూ ‘ఆహా’ వెల్లడించింది.

అయితే ‘ఆహా’ ఈ తప్పిదాన్ని కావాలని చేసిందా? లేదంటే అనుకోకుండా జరిగిందా? అనేది తెలియడం లేదు. తమ సొంత ఫ్లాట్ ఫాంలో మెగాస్టార్ అల్లు అర్జున్ అని వేయడమేంటని ఇది కావాలని చేసిందేనని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అంతకు ముందు చిరు ఈ షోకి గెస్ట్‌గా వచ్చారు కాబట్టి బై మిస్టేక్ ఈ తప్పిదం జరిగిందనుకున్నప్పటికీ చిరుతో షో ఆల్రెడీ ప్లే అయిపోయింది. తరువాత బన్నీ ప్రోగ్రాం అనౌన్స్ జరిగింది. కాబట్టి ఇది కావాలని చేసిందేనని చిరు అభిమానుల వాదన. మొత్తానికి ‘ఆహా’ క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

More News

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు.

రిపబ్లిక్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది.

తేజ సినిమా నుండి తప్పుకున్న గోపీచంద్

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఒకానొక ద‌శ‌లో స‌క్సెస్‌లు లేక ఖాళీగా కూర్చుంటే డైరెక్ట‌ర్ తేజ త‌న‌ని జ‌యం, నిజం వంటి సినిమాల్లో విల‌న్‌గా చూపించి త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి

‘నల్లమల’మోషన్ పోస్టర్ విడుదల

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో

ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది.