పవన్ శైలి మారుతోందా?

  • IndiaGlitz, [Monday,April 11 2016]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఓ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అదేమిటంటే.. అతనితో ఏ ద‌ర్శ‌కుడు మూడు సినిమాల‌కు ప‌నిచేయ‌క‌పోవ‌డం. ఇక రెండో సినిమాల‌కు ప‌నిచేసిన వాళ్లంద‌రిని గ‌మ‌నిస్తే.. అంత‌కుముందు అత‌నితో క‌చ్చితంగా హిట్ ఇవ్వ‌డం వ‌ల్లే ఆ అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు.

అయితే త‌న శైలికి భిన్నంగా త‌న‌తో చేసిన గ‌త చిత్రం ఫెయిలైనా మ‌రో అవ‌కాశం ఇస్తున్నాడు ప‌వ‌న్‌. ఆ అవ‌కాశం ఇచ్చేది మ‌రెవ‌రికో కాదు ఎస్‌.జె.సూర్య‌ కి. 'పులి' వంటి డిజాస్ట‌ర్ త‌రువాత సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ మ‌రో చిత్రం చేయ‌నున్నాడు. గ‌తంలో 'ఖుషి' అనే హిట్ చిత్రం ఈ కాంబినేష‌న్‌లో ఉండ‌డ‌మే స‌ద‌రు ద‌ర్శ‌కుడికి ఈ మూడో ఆఫ‌ర్ రావ‌డానికి కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో కూడా జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

ఏదేమైనా త‌మ కాంబినేష‌న్‌లోని గ‌త చిత్రం హిట్ లిస్ట్‌లో ఉంటేనే ఆఫ‌ర్ ఇచ్చే ప‌వ‌న్.. ఫ్లాప్ ఉన్నా ఛాన్స్ ఇవ్వ‌డం చూస్తే ప‌వ‌న్ శైలి మారుతోంద‌ని భావించ‌క త‌ప్ప‌దేమో. ప‌వ‌న్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి సినిమా చేస్తున్న మొద‌టి ద‌ర్శ‌కుడుగా సూర్య ప్ర‌త్యేక క్రెడిట్‌ని సొంతం చేసుకున్న‌ట్లే.. గ‌త చిత్రం ఫ్లాప‌యినా త‌న ఫేవ‌రేట్ హీరోతో తాజా చిత్రం కోసం హిట్ ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

More News

అక్కినేని అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 13న 'ఊపిరి' థాంక్స్ మీట్

కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25ప విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

వేదాళం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజైంది.దీంతో పవన్ నెక్ట్స్ మూవీ ఏమిటనేది ఆసక్తిగా మారింది. అయితే...తమిళ్ లో ఘన విజయం సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న'రాజా చెయ్యి వేస్తే'

బాణం సినిమా నుండి నేటి వరకు ప్రతి సినిమాను డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’.

ఈ నెలలోనే పవన్ సినిమాకు ముహుర్తమా?

ఏంటి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కదా రిలీజైంది.అప్పుడు మరో మూవీ చేయడమేంటని అనుకునేరు.

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.