close
Choose your channels

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్. ప్ర‌స్తుతం ఈ సంస్థ‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ ల‌తో చిత్రాల‌ను నిర్మిస్తూ...అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ త‌దుప‌రి చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నిర్మించేందుకు ప్లాన్ చేసింది.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ - త్రివిక్ర‌మ్ వీరిద్ద‌రి క్రేజీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాల‌నుకున్నారు. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ఇద్ద‌రికీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే...ఏమైందో ఏమో..కానీ ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ మేము మీకు సినిమా చేయాల‌నుకోవ‌డం లేదంటూ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసార‌ట‌. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ఈవిధంగా మైత్రీ మూవీమేక‌ర్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇటీవ‌ల ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ..త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తాన‌ని చెప్పారు. అంటే ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని వేరే నిర్మాత నిర్మించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.