తెలుగుదేశం పార్టీకి భుజం కాసినప్పుడు నా కులం గుర్తుకురాలేదా - పవన్

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ...నేను తెలుగుదేశం ప‌క్ష‌పాతిని తొత్తుని కాదు. ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతిని రైతు ప‌క్ష‌పాతిని... ఆడ‌బిడ్డ‌ల ప‌క్ష‌పాతిని.. అంతే కానీ నేను ఏ ఒక్క పార్టీకో వ్య‌క్తుల‌కో నా జీవితాన్ని ఇవ్వ‌ను అన్నారు. అభిమాని వినోద్ మ‌ర‌ణం గురించి మాట్లాడుతూ.... సినిమా అనేది వినోదంగానే చూడండి. వేరే హీరోల‌తో నేను బాగానే ఉంటాను. వినోదాన్ని చూసి మ‌ర‌చిపోండి.
నేను నిజ జీవితాన్ని సీరియ‌స్ గా తీసుకుంటాను. నాతో స‌హ ఏ హీరో న‌టించినా అది సినిమా కోసం. క్ష‌ణిక‌మైన కోపంతో జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌ద్దు. జ‌న‌సేన సైనికుడు వినోద్ హ‌త్య‌కు గురైయ్యాడు అని తెలిసిన‌ప్పుడు చాలా బాధేసింది. ఏడుపు వ‌చ్చేసింది. రాత్రి ఇంటికి వ‌స్తాను అన్న బిడ్డ హ‌త్య‌కు గురైయ్యార‌ని తెలిసి ఆ త‌ల్లి ప‌డ్డ వేద‌న అంతా ఇంతా కాదు. కొడుకు చ‌నిపోయాడు అనే బాధ‌లో ఉన్నా కూడా క‌ళ్లు దానం చేసిన‌ గొప్పమ‌నిషికి పాదాభివంద‌నాలు. అలాంటి త‌ల్లుల బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అమ‌రావ‌తిలో రైతులు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటే వెళ్లాను. తెలుగుదేశం పార్టీ వాళ్లు సానుకూలంగానే స‌హ‌క‌రించారు. స‌మ‌స్య ఎక్క‌డ వ‌చ్చింది అంటే....నేను భుజం కాసాను. నా వ‌ల్ల అధికారంలోకి వ‌చ్చిందా అని ఆలోచించ‌ను. మ‌న సాయం మ‌నం చేసాం అంతే ఆలోచిస్తాను. నేను రిస్క్ ఎదుర్కొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. మోడీని క‌లిసిన‌ప్పుడు తెలుగుదేశంకు స‌పోర్ట్ అందించిన‌ప్పుడు ప‌వ‌న్ అభిమానులు స‌మాజానికి ఉప‌యోడ‌ప‌డే వాళ్లు అని రాసారు. కానీ...ఆశ్చ‌ర్యం ఏమిటంటే... స‌డ‌న్ గా తెలుగుదేశం ప్ర‌భుత్వ విధివిధానాల‌ను అడిగాను. అంతే....ప‌వ‌న్ చుట్టూ అత‌ని కులం వాళ్లే ఉంటారు అని రాసారు.
నా కూతురు క్రిష్టియ‌న్. నా కూతురుకి త‌ల్లి త‌న మ‌తాచార్ని ఇస్తాను అంటే స‌రే అన్నాను. నేను హిందువులో పుట్టాను. నా దృష్టిలో స‌ర్వ‌మ‌తాలు ఒక్క‌టే. స‌ర్వ‌కులాలు ఒక్క‌టే. అలాంటిది నాకు కులం, ప్రాంతం అంట‌గ‌డితే కోపం వస్తుంది. అలా రాసిన స‌న్నిహితుల‌కు చెప్పాను. తెలుగుదేశం భుజం కాసిన‌ప్పుడు నా కులం గుర్తుకురాలేదా అన్నాను. అర్ధం చేసుకుని రిపీట్ చేయ‌లేదు.మ‌న‌ది ఒక‌టే కులం మాన‌వ‌తా కులం అంటూ త‌న ఆవేద‌న‌ వ్య‌క్తం చేసారు.

More News

జనసేన భజన సేన కాదు...తెలుగు రాష్ట్రాల ప్రజలకు భజన సేన - పవన్

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి తుడా ఇందరా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...

'కాష్మోరా' డబ్బింగ్ పూర్తి చేసిన కార్తీ

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,

ర‌జనీకాంత్ కుమార్తెకు అరుదైన గౌర‌వం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్  కుమార్తె ఐశ్వ‌ర ధ‌నుష్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఐక‌రాజ్య‌స‌మితి ఉమెన్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. సింగ‌ర్‌, ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేసిన ఐశ్వ‌ర్యకు ఇప్పుడు ఇలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల త‌మిళ మీడియా, ప్ర‌జ‌లు, స‌న్నిహితులు హ‌ర్షం వ‌క్తం చేస్తున్నారు.

స్వార్ధం కోసం.. చిరంజీవి పై అబ‌ద్ద‌పు ప్ర‌చారం

ఈమధ్య చిరంజీవి  గురించి అబధ్ధాల ప్రచారం ఎక్కువయ్యింది...గతం లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎలా చేసారో మళ్ళీ అలా...కొంతమంది స్వార్ధం కోసం చిరంజీవి మీద రకరకాలుగా కేవలం అబధ్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పులు తొడుక్కునేలోపల అబధ్ధం ప్రపంచాన్నే చుట్టివచ్చేస్తుందనే నానుడి ఋజువయ్యింది.ఆర్.కె.నాయుడు (చిరంజీవి అమ్&#

గర్ల్ ఫ్రెండ్ తో ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన అఖిల్..!

అక్కినేని అఖిల్,జి.వి.కె మనవరాలు శ్రేయా భూపాల్ తో ప్రేమలో పడ్డాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.