పవన్ ప్రజెంట్ టార్గెట్..

  • IndiaGlitz, [Monday,April 18 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని...రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాకా సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తాను అని ప్ర‌క‌టించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల లోపు ప‌వ‌న్ ఎన్ని సినిమాలు చేయ‌నున్నారు అనేది అటు ఆడియోన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఎస్.జె.సూర్య‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.
మే నెలాఖ‌రున కుద‌ర‌క‌పోతే జూన్ మొద‌టివారంలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు నిర్మాణంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. ఈ మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందే ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మించ‌నున్నారు. ఈ మూడు చిత్రాల‌ను రెండు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేయాల‌నుకుంటున్నాడు ప‌వ‌న్. సో..2 ఇయ‌ర్స్ 3 మూవీస్ ఇదే ప‌వ‌న్ ప్ర‌జెంట్ టార్గెట్.

More News

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్‌'

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం  'కుమారి 21ఎఫ్‌. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అమ్మకు అఖిల్ అభినంద‌న‌

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా  జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే.

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై  24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు

పూరి పై దాడి చేసాం అనేది అవాస్త‌వం - లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్...త‌న పై దాడి చేసార‌ని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం...పోలీసులు డిస్ట్రిబ్యూట‌ర్స్ పై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు.

ఈ నెల 23న వస్తున్న హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ'

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్  తెలుగులో "శశికళ" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.  భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.