ఇది మార్పుకు సూచకమే..: పవన్

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? జనాలతో ఎలా మమేకం కావాలి...? పార్టీని, గుర్తును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అని జనసేనాని దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం నాడు విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్ధుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చ‌దువుతోపాటు రాజ‌కీయాల మీద ఆస‌క్తి చూపడం మార్పుకి సూచ‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. విద్యార్ధి ద‌శ నుంచే బీసీ హాస్ట‌ల్స్‌, ఎస్సీ హాస్ట‌ల్స్ అంటూ కుల వ్య‌వ‌స్థ‌ని పెంచి పోషిస్తున్నార‌ు. జ‌న‌సేన పార్టీ మాత్రం అలా చేయ‌దని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.

విద్యార్ధుల భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన పార్టీ పాటుప‌డుతుంది. విద్యార్ధుల్లో రాజ‌కీయ చైత‌న్యం రావాలి. అందుకోసం అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా వివిధ అంశాల‌పై లోతైన చ‌ర్చ‌లు జ‌ర‌పాలి అని విద్యార్థులకు జనసేన అధినేత పిలుపునిచ్చారు. పవన్ ఇచ్చిన హామీతో సమావేశానికి వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు మరోసారి రావాలని పలువురు విద్యార్థులు.. పవన్‌ను కోరగా రావాల్సిన టైం వస్తే రాకుండా ఆగనని చెప్పినట్లుగా తెలుస్తోంది.

More News

మోదీ ఎలక్షన్ ప్లాన్ సక్సెస్.. ఈబీసీ బిల్లు పాస్

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు వేసిన పాచిక ఫలించింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సక్సెస్ అయ్యింది.

బాంబులేసినా చ‌లించ‌నంత బ‌లం నా దగ్గరుంది: పవన్

తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఫలానా సమస్య ఉందని జనసేనను సంప్రదిస్తే చాలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనవంతుగా పరిష్కార మార్గం చూపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

సైరా రిలీజ్ గురించి చెప్పిన చెర్రీ

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర

ఈబీసీలకు 10% రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఇదీ..

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

జగన్‌ పై దాడి కేసు: ఎన్ఐఏ గుట్టు విప్పబోతోందా..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‌‌ఐఏ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు ఎన్ఐఏకు చేరింది.