కొరియోగ్రాఫ‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ..!

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.... త‌నతో వ‌ర్క్ చేసే ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అందుక‌నే ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇక ప‌వ‌న్ తో వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది అంటే ఆ ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంటారు. ఇప్పుడు అలాంటి ఆనందాన్నే జానీ మాస్ట‌ర్ ఆస్వాదిస్తున్నారు. ప‌వ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు.

ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సాంగ్ కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫి అందిస్తున్నారు. ఈ విష‌యాన్ని జానీ మాస్ట‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...చాలా రోజుల‌ త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి సాంగ్ కి కొరియోగ్ర‌ఫి చేస్తున్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్నిక‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది అంటూ జానీ మాస్ట‌ర్ తో ప‌వ‌న్ తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసారు. అది సంగ‌తి..!

More News

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇజం చిత్రం క‌ళ్యాణ్ రామ్ కి న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఇజం చిత్రం విడుద‌లైన అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

బోయపాటి నిర్మాతలు మారారు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్తో సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్తో వందకోట్ల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

క‌న్ ఫ్యూజ‌న్ లో ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందు..!

కార్తికేయ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

సమస్యల్లో 'ఆక్సిజన్'....?

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.