close
Choose your channels

బోయపాటి నిర్మాతలు మారారు

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్‌తో స‌రైనోడు వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌తో వంద‌కోట్ల డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను నిర్మించ‌డానికి రంగం సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం వ‌చ్చింది.

అయితే ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు నిర్మాత‌లు మారారు. కార‌ణాలు తెలియ‌లేదు కానీ ఇప్పుడు ఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు నిర్మించడం లేదట‌. నాగ‌చైత‌న్య‌తో సాహసం శ్వాస‌గా సాగిపో సినిమాను నిర్మించిన గురుఫిలింస్ అధినేత ఎం.ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించ‌డానికి రెడీ అన్నార‌ట‌. ఈ సినిమాను న‌వంబ‌ర్ నుండి సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.