పోలీసులూ మీకిది తగునా.. స్టూడెంట్స్‌పై ఏంటీ ప్రవర్తన!?

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యలతో అట్టుడుకుతోంది. ఓ వైపు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌‌లోని ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగుతుండగా.. మరోవైపు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. ఇవన్నీ అటుంచితే తాను అన్నీ రాశాను కానీ ఫెయిల్ చేశారు.. తనకు జీరో మార్కులు వేశారు.. ఇలా ఒక్కో విద్యార్థి గాథ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ తప్పిదాలతో ఇంటర్ బోర్డు సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక విషయానికొస్తే.. తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఫలితాల్లో చూసుకున్న విద్యార్థిని తన తల్లితో కలిసి తన గోడు ఇంటర్ బోర్డులో చెప్పుకునేందుకు వచ్చింది. సరిగ్గా బోర్డు దగ్గరికి కూడా పోలేదు.. అప్పుడే పోలీసులు వచ్చి ఆ విద్యార్థిని, తల్లిని ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. సార్ నేను వచ్చింది నా పరీక్షల గురించి అడిగి తెలుసుకోవడానికి వచ్చాను.. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ జవాబు పత్రాలు ఇవ్వమని అడిగేందుకు వచ్చానని గట్టిగా పోలీసులతో వాదించగా.. ఆమె గోడు వినని పోలీసులు వాహనంలోకి లాక్కెళ్లారు. ఈ ఘటన చూసిన వాళ్లంతా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

పోలీసుల వైఖరిపై సర్వత్రా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డు తీరుకు వ్యతిరేకంగా.. తెలంగాణ సర్కార్ ఫెయిలైందని ప్రతిపక్షాలు, విద్యార్థి తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు ఆందోళనాకారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా జైళ్లకు వెళ్లిన వారు కోకొల్లలు. ఇలా వరుస వివాదాలతో అసలు ‘బంగారు తెలంగాణ’ అంటే ఇదేనా..?.. ఇందుకోసమేనా ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది..? అంటూ రాష్ట్ర ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం గంట గంటకూ.. రోజురోజుకూ ముదురుతోందే తప్ప .. ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.

More News

లాస్ట్ మినిట్‌లో టూర్ రద్దు.. లంక పేలుళ్లలో శివాజీ రాజా ఫ్రెండ్ మృతి!

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటికే 292 మందికిపైగా మృతి చెందగా.. అంతకు రెట్టింపు మంది క్షతగాత్రులయ్యారు.

మత్తులో ఫ్రెండ్‌కు ఫోన్.. రాకపోవడంతో ఉరేసుకుని లైవ్‌లో..!

ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పనికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలే రాత్రిపూట పీకల్లోతు మద్యంతలో మునిగి తేలుతున్న ఆ యువకుడు..

'నువ్వు తోపు రా' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం 'నువ్వు తోపురా'. యునైటెడ్ ఫిలింస్‌, ఎస్‌.జె.కె. ప్రొడ‌క్ష‌న్స్(యు.ఎస్‌.ఎ) ప‌తాకాల‌పై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దిక్సూచి'

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌

సింగిల్ సాంగ్‌తో వావ్ అనిపించిన అమెరికా కోయిలలు

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నోళ్లు దునియానే ఏలొచ్చు.. అనేది అక్షర సత్యం.