ప్ర‌భాస్ సినిమా గురించి పూజా ఏమందంటే..

  • IndiaGlitz, [Tuesday,March 20 2018]

వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ క‌డుతుండ‌డంతో.. ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది  అందాల తార పూజా హెగ్డే. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌.. టాలీవుడ్ స్టార్ హీరోలైన‌ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో న‌టించే అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అంతేకాదు.. ఇటీవల వీరిని బాలీవుడ్ ఖాన్ త్రయంతో పోలుస్తూ ఆకాశానికేత్తేసింది. ఇదిలా ఉంటే.. ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేసింది పూజా.

“ప్రభాస్‌తో కలిసి నటించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అలాగే ప్రభాస్‌కున్న‌ ఇమేజ్‌కు, క్రేజ్‌కు బెదరకుండా.. డైరెక్టర్ నాకు ఇచ్చిన బాధ్య‌త‌ను సక్రమంగా నిర్వర్తించాలి, చక్కగా నటించాలి. ప్రభాస్ సరసన నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అలాగే నాకో గుర్తింపు తెచ్చుకోవాలి” అంటూ పూజా చెప్పుకొచ్చింది. ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న‌ ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

More News

'ఆనందం' పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్!

అన్నం ఉడికిందా అని చూడ్డానికి ఒక మెతుకు ప‌ట్టుకుంటే చాల‌ని అంటారు. అలాగే సినిమా ఎలా ఉండబోతుందో చెప్ప‌డానికి పాట‌ల‌కు వ‌స్తున్న స్పంద‌న చూస్తే చాలు.

యు.కె. నేప‌థ్యంలో వ‌రుణ్ చిత్రం

‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

'భ‌ర‌త్ అనే నేను'.. ఆడియో వేడుక‌కి స్పెష‌ల్ సెట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అనే నేను’.

'మ‌హాన‌టి' షూటింగ్ పూర్తిచేసిన స‌మంత‌

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

వేస‌విలో నిత్యా మీన‌న్ 'ప్రాణ'

కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్‌.. ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. 'ప్రాణ'