close
Choose your channels

'భ‌ర‌త్ అనే నేను'.. ఆడియో వేడుక‌కి స్పెష‌ల్ సెట్‌

Tuesday, March 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భ‌ర‌త్ అనే నేను.. ఆడియో వేడుక‌కి స్పెష‌ల్ సెట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. కైరా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.

వైజాగ్‌లో నిర్వ‌హించే.. ఈ ఆడియో వేడుక కోసం అసెంబ్లీని పోలిన ప్ర‌త్యేక సెట్‌ను వేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ సినిమాలో మ‌హేష్‌.. ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు ఈ సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని.. అందుక‌నే అసెంబ్లీ సెట్ వేసి ఈ పాట‌ల వేడుకను నిర్వ‌హించ‌నున్నార‌ని చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.