‘‘ఎఫ్ -3’’లో జిగేల్ రాణి స్పెషల్ సాంగ్.. షూట్‌లో జాయిన్ అయిన పూజా, ఫోటో వైరల్

గతంలో ఐటెం సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా నటీమణులు వుండేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మీ, సిల్క్ స్మిత, అభినయశ్రీ, వంటి వారికి హీరోలతో సమానంగా క్రేజ్ వుండేది. హోయలుపోతూ.. మాస్ స్టెప్పులతో జనాన్ని హుషారెక్కించేవారు. దీంతో సినిమాలకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసిది. దర్శక నిర్మాతలు కూడా సినిమాలో ఎక్కడో ఒక చోట స్పెషల్ సాంగ్‌ని ఇరికించేవారు. తెలుగు నాట కే. రాఘవేంద్రరావు ఈ తరహా పాటలను పాపులర్ చేశారు. తర్వాత పలువురు దర్శకులు అవసరం మేరకు ప్రత్యేక గీతాలను వాడుకుంటున్నారు. నేటి తరంలో సుకుమార్‌ని స్పెషల్ సాంగ్స్‌కి స్పెషలిస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఆర్య నుంచి పుష్ప వరకు ఆయన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ని తెలుగు ప్రజలతో పాటు దేశాన్ని ఒక ఊపు ఊపాయి.

ఇకపోతే.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేసే కల్చర్ మొదలైంది. సమంత, కాజల్, అనుష్క, తమన్నా వంటి అగ్ర కథనాయికలు ఐటెం సాంగ్స్ చేశారు. వీరి బాటలోనే నడుస్తున్నారు పూజా హెగ్డే. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ‘‘రంగస్థలం’’లో ఆమె చేసిన ‘జిగేల్ రాణి’ ప్రత్యేక గీతానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వుంటున్నారు పూజా. అయినప్పటికీ స్పెషల్ సాంగ్ చేసేందుకు కమిట్ అయ్యారు.

ప్రస్తుతం ఈ పొడుగుకాళ్ళ సుంద‌రి .. వెంకటేశ్, వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘ఎఫ్‌-3’లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. 2019లో వచ్చిన ‘ఎఫ్‌-2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మే 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో పూజా న‌ర్తించ‌బోతున్న‌ట్లు గ‌త వారం రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ పూజాహెగ్డే ‘ఎఫ్‌-3’ స్పెష‌ల్ సాంగ్ షూట్‌లో జాయిన్ అయిన‌ట్లు మేక‌ర్స్ పూజా ఫోటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More News

'మాటరాని మౌనమిది' చిత్ర గ్లింప్స్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది".

ఎక్కడికి కావాలంటే అక్కడికి లాక్కెళ్లవచ్చు.. ఏపీలో మొదటి మొబైల్ థియేటర్, ఎక్కడో తెలుసా..?

అలిసిన మనసుకు ఒత్తిడిని దూరం చేసి.. మూడు గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిది సినిమా.

విజయ్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

కరోనా పరిస్థితులన్నీ చక్కబడటంతో థియేటర్‌లలో సినిమాలు క్యూకడుతున్నాయి.

బిగ్‌బాస్ ఓటీటీ: గాడిలో పడుతోన్న గేమ్.. ఆ కంటెస్టెంట్ ఆటకు జనం ఫిదా, టైటిల్ అతనిదేనా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ...

ఎనిమిదేళ్ల కష్టం... థియేటర్లో ఫొటోలు, వీడియోలు తీయొద్దు : ప్రేక్షకులకు కేజీఎఫ్ టీమ్ రిక్వెస్ట్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.