‘ఆచార్య’తో జాయిన్ అయిన పూజా హెగ్డే..!

  • IndiaGlitz, [Thursday,February 11 2021]

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 09 నుంచి పూజా హెగ్డే ఆచార్య టీమ్‌తో జాయిన్ అయ్యింది.

ఇర‌వై రోజుల పాటు పూజా హెగ్డే ఆచార్య కోసం కాల్షీట్స్‌ను కేటాయించింద‌ని, అందుకు కోటి రూపాయ‌ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మే 13 నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజర్‌తో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

దేవాదాయ‌శాఖ‌లో అవినీతిని ప్ర‌శ్నించే విధంగా మంచి మెసేజ్‌తో సినిమా క‌థ‌ను డిజైన్ చేశాడ‌ట కొర‌టాల శివ‌. చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్ర‌లో క‌నిపిస్తే.... రామ్‌చ‌ర‌ణ్ సిద్ధ అనే న‌క్సలైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More News

ఎంఐఎం మద్దతు ఇచ్చిందా? నేను చూడలేదు: మేయర్ విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. మేయర్ ఎన్నిక అనంతరమే విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్‌గా

చరణ్, యష్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

సౌత్ ఇండియాలో స్టార్ హీరోల కాంబినేష‌న్‌లో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత

కొన్ని నెలల పాటు మహా నగర ప్రథమ పౌరురాలి ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు నేడు ముహూర్తం ఖరారు చేసింది.

ఎన్టీఆర్ 31 ఫిక్స్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నిర్మాత‌లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

‘ఉప్పెన’ టీంకు పవన్ అభినందనలు..

‘ఉప్పెన’... మన చుట్టూ ఉన్న జీవితాల్ని చూపించే చిత్రమని.. తొలి చిత్రంతోనే మంచి పాత్రలో నటించిన వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల మెప్పు పొందుతాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు.