ప్రభాస్‌ పుట్టినరోజు స్పెషల్‌ ఫిక్స్‌

  • IndiaGlitz, [Saturday,October 17 2020]

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. వరుసగా ప్యాన్‌ ఇండియా సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఆయన ఖాతాలో ఇప్పుడు మూడు ప్యాన్‌ ఇండియా సినిమాలున్నాయి. అందులో ముందుగా'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్‌' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి గతంలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మేకర్స్‌ ఇటీవల ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే నటిస్తుందంటూ ఆమె లుక్‌ను విడుదల చేశారు.

ఈ క్రమంలో ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23, ఈ సందర్భంగా 'రాధేశ్యామ్‌' టీజర్‌ విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ మేకర్స్‌ 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'మరోసారి మీరు వారి ప్రేమలో తప్పకుండా పడతాడు. అక్టోబర్‌ 23న రాధేశ్యామ్‌ మోషన్‌ పోస్టర్‌' అంటూ నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువీ సంస్థ ప్రకటిస్తూ ఓ పొగరైలుబండి పోస్టర్‌ను షేర్‌ చేసింది. ప్రస్తుతం సినిమా ఇటలీలో చిత్రీకరణను జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ పీరియాడికల్ లవ్ స్టోరిని వచ్చే ఏడాది వేసవిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

More News

రవితేజ67 లేటెస్ట్‌ అప్‌డేట్‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను రీస్టార్ట్‌ చేసిన మాస్‌రాజా,

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్.. 3 నెలల క్రితమే ప్లాన్..

కూకట్‌పల్లి గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహం ముసుగులో యువతిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం జరిపారు.

గ్రేటర్‌లో చెరువులన్నీ ఇళ్లవగా... తిరిగి ఇళ్లన్నీ చెరువులయ్యాయి..

ఎవరి పాపమో.. నేడు ఎన్నో కుటుంబాలకు శాపంలా మారింది. అభం శుభం తెలియని చిన్నారులను సైతం పొట్టనబెట్టుకుంది.

బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీకపై కేసు నమోదు..

బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ కత్తి కార్తీకపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 52 ఎకరాల స్థలాన్ని రూ.35 కోట్లకు ఇప్పిస్తానని కోటి రూపాయలు అడ్వాన్స్‌గా

'రంగ్ దే' చిత్రం  లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల

'ప్రేమ' తో కూడిన కుటుంబ కధా చిత్రం 'రంగ్ దే'. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్‘ పుట్టినరోజు సంధర్భంగా ‘ రంగ్ దే‘ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్.