ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుండంటే!

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

'బాహుబ‌లి'తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత 'సాహో' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుద‌లైనప్ప‌టికీ బాహుబ‌లిలా ప్రేక్ష‌కుల‌ను అన్ని భాష‌ల్లో ఆక‌ట్టుకోలేదు. అయితే ప్ర‌భాస్ ఇప్పుడు చేస్తోన్న తాజా చిత్రం 'జాన్‌'(విన‌ప‌డుతున్న టైటిల్‌)ని కూడా ప్యాన్ ఇండియా చిత్రంగానే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుకు త‌గిన‌ట్లుగానే సినిమా రూపొందుతోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల కానుంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతుంది. వివ‌రాల ప్ర‌కారం జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి అన్న‌పూర్ణ స్టూడియోలో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో సెవెన్ ఏకర్స్‌లో మూడు భారీ సెట్స్ వేశారట‌. 1960-70 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొన‌సాగే ప్రేమ‌క‌థాశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. పూర్వ‌జ‌న్మ‌లో ధ‌న‌వంతుడిగా ప్ర‌భాస్‌, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుంద‌ట‌. ఆ స‌మ‌యంలో విఫ‌ల‌మైన వారి ప్రేమ ఇప్ప‌టి కాలంలో ఎలా క‌లిసింద‌నేదే క‌థ‌ట‌. ప్ర‌భాస్ ఇందులో హ‌స్త‌సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌బోతున్నాడ‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

More News

వెంకీ, నానిల మల్టీస్టారర్.. ప్రొడ్యూసర్‌గా సురేశ్ బాబు!

తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు విక్టరీ వెంకటేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’,

'RRR' మేకింగ్ వీడియో లీక్‌.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మల్టీస్టార‌ర్ `RRR`.

రెండువేల నోటు రద్దుపై తేల్చేసిన కేంద్రం..

పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

మహేశ్ ఫ్యాన్స్‌కు రాజేంద్రప్రసాద్ గుడ్‌న్యూస్!

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.