close
Choose your channels

20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`. ఆగస్ట్ 30న సినిమా విడుదల కానుంది. రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు. మరి హీరో ప్రభాస్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో అని అందరూ భావించారు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పిన మాటలు విని అందరూ షాకయ్యారు.

ఎందుకంటే `సాహో` సినిమాను తన స్నేహితులే నిర్మించారని, బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైందన్నారు ప్రభాస్. బడ్జెట్ ఎక్కువ అవడంతో నేను రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని, సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ నుండి ఇరవై శాతం మాత్రమే తీసుకున్నానని తెలిపారు ప్రభాస్. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, చంకీ పాండే, మందిరా బేడి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.