ప్రభాస్ ద్విపాత్రాభినయం..?

  • IndiaGlitz, [Wednesday,July 15 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమా ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అంతా స‌జావుగానే సాగుతున్న‌స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’సినిమా షూటింగ్ ఆగింది. దీన్ని పూర్తి చేసిన తర్వాతే వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ చేయాలనుకుంటున్నాడు. భారీ సైన్సు ఫిక్షనల్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట.

రెండు విభిన్నమైన కాలాల్లో ఒకేసారి జరిగే కథగా దీన్ని నాగ్ అశ్విన్ తయారు చేశాడట. ఈ రెండు కాలాల్లో ప్రభాస్ వేర్వేరు గెటప్స్‌తో కనపడబోతున్నాడన్నమాట. అంటే ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లేగా. ఈ రెండు పాత్రలను ఎలా కలుసుకున్నాయి? ఎందుకు కలుసుకున్నాయనేదే సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారా లేదా? అని తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పటికే దీపికా పదుకొనెను హీరోయిన్‌గా నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్.

More News

అల్లు అర్జున్‌ని ఆరాదిస్తోన్న బాలీవుడ్ తారలు

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘అల వైకుంఠపురములో..’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్.

జగన్ కీలక నిర్ణయం.. కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15000

ఏపీ సీఎం జగన్ కరోనా బాధితుల విషయమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో

హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌’

ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై, ప్రేక్ష‌కాద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్‌’.

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.. ఆరుగురి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్

కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేశాలన్నీ వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

కేసీఆర్ వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా?: ఒవైసీ

సీఎం కేసీఆర్ కనిపించడం లేదనే వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.