న‌క్ష‌త్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ లుక్ రిలీజ్ చేసిన చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Tuesday,October 18 2016]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు. కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ఓ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తుంది. న‌క్ష‌త్రం చిత్రంలోని ప్ర‌గ్యా జైస్వాల్ లుక్ ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసారు.

ఈ ఫ‌స్ట్ లుక్ లో ప్ర‌గ్యా...గ‌న్ ప‌ట్టుకుని చాలా ఠీవిగా కూర్చొని ఉంది. త‌న గ‌త చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్న స్టిల్ చూస్తుంటే...పోలీస్ గా న‌టిస్తుందేమో అనిపిస్తుంది. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా పోలీస్ గా స్పెష‌ల్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. పోలీస్ అవ్వాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, స‌జ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More News

మ‌హేష్ అలా....జ‌రిగితే అద్భుతం అన్నారు ఆత‌ర్వాత‌ షాక్ అయ్యారు - హీరో న‌వీన్ విజ‌య‌కృష్ణ‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

ఉక్రెయిన్ కు చిరు...

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

నవంబర్ 4 న విడుదల కానున్న 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి'చిత్రంతో కాళకేయ గా సినిమా ప్రేక్షకుల ప్రశంశలు పొందిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'..

డి.జె.దువ్వాడ జగన్నాథమ్ లేటెస్ట్ అప్ డేట్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె.దువ్వాడ జగన్నాథమ్.