అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ప్రేమంటే సులువు కాదురా'

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

రాజీవ్ సాలూరి-సిమ్మీదాస్ జంటగా.. యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. "ఆర్.పి ప్రొడక్షన్స్" పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ "ప్రేమంటే సులువు కాదురా". కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు ఈ చిత్రానికి సహ నిర్మాతలు. నందన్ రాజ్ సంగీతం సమకూర్చిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి "ప్రాణం" కమలాకర్ రీ-రికార్డింగ్ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "మా దర్శకుడు చందా గోవింద్ రెడ్డి "ప్రేమంటే సులువు కాదురా" చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే "ప్రాణం" కమలాకర్ ఆర్.ఆర్ కూడా. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ సంగీత దర్శకులు కోటి "మా అబ్బాయి రాజీవ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో "ప్రేమంటే సులువు కాదురా" ది బెస్ట్ సినిమా" అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడం.. ఈ సినిమా సాధించబోయే విజయంపై మాకు మరింత నమ్మకం కలిగించింది.
అలాగే.. "భలే భలే మగాడివోయ్, బాబు బంగారం" వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎస్.బి.ఉద్ధవ్ సబ్జెక్టు నచ్చి మా చిత్రానికి పని చేయడం మాకు గర్వకారణం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. "2016లో ఘన విజయం సాధించిన చిత్రాల జాబితా"లో "ప్రేమంటే సులువు కాదురా" కచ్చితంగా ఉంటుందనే నమ్మకం మాకుంది" అన్నారు.

More News

ఈషా గుప్తా టాలీవుడ్ ఎంట్రీ

స్వామిరారా హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

చిరంజీవి సినిమాలో నిహారిక...?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా,ప్రెస్టిజియస్ 150మూవీ 'ఖైదీ నంబర్ 150'

నందుతో రష్మీ....

బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన రష్మీ తన గ్లామర్ తో మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.

'జ్యో అచ్యుతానంద' సెన్సార్ పూర్తి

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద`.

మురుగదాస్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎ.ఆర్.మురుగదాస్ చేస్తున్న సినిమా హైదరాబాద్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట.