అలా చెప్పడం కూడా తప్పేనా - ప్రియమణి

  • IndiaGlitz, [Friday,May 06 2016]
కేర‌ళ లోని లా స్టూడెంట్ జిషాను అత్యాచారం చేసి...ఆత‌ర్వాత దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న పై క‌థానాయిక ప్రియ‌మ‌ణి ట్విట్ట‌ర్ లో...ఆడ‌వాళ్ల‌ను వేధించే వాళ్ల‌ను వ‌ద‌ల‌కూడ‌దు. అర‌బ్ దేశాల్లో అయితే శిక్ష‌లు క‌ఠినంగా ఉంటాయి. మ‌న దేశంలో కూడా క‌ఠిన శిక్ష‌లు విధించాలి. క‌ఠిన శిక్ష‌లు విధిస్తేనే నేరాలు త‌గ్గుతాయి. మ‌న దేశంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేదు. అందుచేత ఏ దేశంలో మ‌న‌కు ర‌క్ష‌ణ ఉంటుందో అక్క‌డికి వెళ్లిపోవ‌డం మంచిది అంటూ ప్రియ‌మ‌ణి స్పందించారు. అయితే..ప్రియ‌మ‌ణి ఇలా దేశాన్ని విడిచి వెళ్లిపోవ‌డం మంచిది అంటూ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం అవుతున్నాయి.
క‌ఠిన శిక్ష‌లు విధించాలి అన‌డం క‌రెక్టే. కానీ...దేశాన్ని విడిచి వెళ్లిపోదాం అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ప్రియ‌మ‌ణిని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై ప్రియ‌మ‌ణి స్పందిస్తూ...దేశంలో ఆడ‌వాళ్ల ప‌రిస్థితి ఎలా ఉందో చెప్పాను. నిర్భ‌యంగా నా అభిప్రాయం చెప్ప‌డం కూడా త‌ప్పేనా..? నిర్భ‌యంగా మాట్లాడితే నేనేదో దేశానికి వ్య‌తిరేకం అన్న‌ట్టు నా పై ముద్ర వేస్తారా..అంటూ ప్రియ‌మ‌ణి ఆవేద‌న వ్య‌క్త చేస్తుంది. ద‌య‌చేసి నా వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్ధం చేసుకోవ‌ద్దు అంటుంది. అందుక‌నే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించ‌కుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. పెద‌వి దాట‌ని మాట‌కు ప్ర‌భువు నీవు...పెద‌వి దాటిన మాట‌కు బానిస‌వు నీవు...ఎవ‌రైనా స‌రే...ఇది తెలుసుకుని మాట్లాడితే...ఏ స‌మ‌స్య రాదు.

More News

సూర్య 24 రిపోర్ట్ వ‌చ్చేసింది..

సూర్య - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య నిర్మించారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 6న రిలీజ్ చేస్తున్నారు.

సాహసం శ్వాసగా సాగిపో సోకిల్లా సాంగ్ టీజర్ రిలీజ్

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ నటిస్తుంది.

సూర్య 24 చూడాల్సిందే...అన‌డానికి అయిదు కార‌ణాలు...

త‌మిళ హీరో సూర్య - మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై హీరో సూర్య నిర్మించారు.

మూడవ షెడ్యూల్లో వీడు గోల్డ్ ఎహే...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం వీడు గోల్డ్ ఎహే.ఈ చిత్రాన్ని బిందాస్ ఫేం వీరు పోట్ల తెరకెక్కిస్తున్నారు.

సందీప్ కిషన్ తో మూడోసారి జత కడుతుంది

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది.