నంది అవార్డులపై స్పందించిన నిర్మాత మల్కాపురం శివకుమార్

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

ఇటీవల ప్రకటించిన మూడు సంవత్సరాల నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా కప్పింది. అవార్డులకు అర్హత వున్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా వున్న వారికే అవార్డులను పంచిపెట్టింది అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్.

భద్రాద్రి, సూర్యవర్సెస్ సూర్య, శౌర్య, శింగం-3 చిత్రాలతో నిర్మాతగా అందరికి సుపరిచితుడైన మల్కాపురం శివకుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల గురించి మాట్లాడుతూ మూడు సంవత్సరాల నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి మిఠాయిలను పంచిపెట్టినట్టుగా పంచిపెట్టింది. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించిన సినిమాలను విస్మరించింది.

2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నిఖల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నేను నిర్మించిన సూర్య వర్సెస్ సూర్య అత్యంత ప్రజాదరణ పొందిన వినూత్నంగా చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇలాంటి కాన్సెప్ట్‌తో అత్యధిక బడ్జెట్‌తో హాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయత్నానికి ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు రాకపోవడం విచారకరం.

హాలీవుడ్ వాళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? అసలు ఈ అవార్డులు తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఇచ్చిన అవార్డులా అనిపిస్తున్నాయి.ఇవి ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. అసలైన చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వకుండా.. తమకు నచ్చిన వారికి అవార్డులు ఇవ్వడం సరికాదు అని తెలిపారు.

More News

నిజ ఘటన..క్లిష్టమైన కేసు ఆధారంగా తెరకెక్కిన 'ఖాకి'

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. ఈ సినిమా నవంబర్ 17న విడుదలవుతోంది. 1995-2005 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను దర్శకుడు వినోద్ ఓ నిజఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.

జనవరి 13న విశాల్‌ కొత్త చిత్రం 'అభిమన్యుడు'

పందెం కోడి నుంచి డిటెక్టివ్‌ వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' పెద్ద హిట్‌ అయిన ఆనందంలో వున్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌ హీరో విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్‌ని ఖరారు చేశా

రామ్‌చరణ్‌ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'టెంప‌ర్' రీమేక్ లో..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టెంప‌ర్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2015లో విడుద‌లైన ఈ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది.

'2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదల

ప్రతిష్టాత్మక మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై  ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.