ఫైనల్‌గా షాక్ ఇచ్చిన పునర్నవి..

  • IndiaGlitz, [Friday,October 30 2020]

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి పునర్నవి భూపాలం.. గత మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా నడుపుతున్న హైడ్రామాకు నేటితో ఫుల్ స్టాప్ పెట్టింది. బుధవారం ‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది’ అనే క్యాప్షన్‌తో వేలికి డైమండ్ రింగ్ ఉన్న పిక్‌ను పున్ను పోస్ట్ చేసింది. దీంతో పున్నూకి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత గురువారం ఉద్భవ్ రఘునందన్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ‘అతనికి ఎస్ చెప్పాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు తన జీవితంలో ఒక గొప్ప రోజు గురించి శుక్రవారం చెబుతానని తెలిపింది.

మరోవైపు రఘునందన్ కూడా తన ఇన్‌స్టాలో పున్నుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది. రేపు మీకొక విషయం చెబుతాను’ అని వెల్లడించారు. రఘునందరన్ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఆయన నటుడిగానూ.. రచయితగానూ కొనసాగుతున్నారు. పలు వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ నేపథ్యంలో పున్ను అభిమానుల్లో ఆసక్తి రెండింతలయ్యింది. ఇంకేంముంది.. ఫోటో కూడా రివీల్ చేసిందంటే ఇక త్వరలో పెళ్లే అనుకున్నారంతా.

అయితే శుక్రవారం మరేదో చెబుతానంటూ పున్ను పేర్కొనడంతో ఇక వీరిద్దరి వివాహ విషయాన్ని పున్ను చెప్పబోతోందని భావించారు. తాజా పోస్టుతో పున్ను అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ హైడ్రామా అంతా తాను రఘునందన్‌తో కలిసి చేయబోయే వెబ్ సిరీస్ కోసమేనని తేల్చి చెప్పింది. పున్ను, రఘునందన్ ప్రధాన పాత్రల్లో ‘కమిట్‌మెంటల్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి ప్రసారం కాబోతోంది. దాని ప్రమోషన్ కోసమే ఈ డ్రామాను పున్ను ప్లే చేసింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌కి కావల్సినంత ప్రచారం జరిగిపోయింది.

More News

పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

'శ్రీదేవి సోడా సెంట‌ర్' టైటిల్, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి సూపర్ హిట్స్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించిన 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్

'లక్ష్మీబాంబ్‌' టైటిల్‌ మార్పు

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌ను న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `కాంచ‌న`

తమన్నా ఆ నిర్ణయమెందుకు తీసుకుంది..?

మిల్కీబ్యూటీ తమన్నా లేటెస్ట్‌ మూవీ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

'ఓదెల రైల్వేస్టేష‌న్' సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది