close
Choose your channels

తమన్నా ఆ నిర్ణయమెందుకు తీసుకుంది..?

Friday, October 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమన్నా ఆ నిర్ణయమెందుకు తీసుకుంది..?

మిల్కీబ్యూటీ తమన్నా లేటెస్ట్‌ మూవీ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలేం జరిగిందనే వివరాల్లోకెళ్తే.. కోవిడ్‌ ప్రభావంతో కుదేలైన రంగాల్లో సినీ రంగం ముందు వరుసలో ఉంది. ఇప్పుడిప్పుడు షూటింగ్స్‌ మొదలవుతున్నాయి. ఆరేడు నెలల పాటు ఆగిన షూటింగ్స్‌ అన్నీ ఒకేసారి స్టార్ట్‌ కావడంతో స్టార్స్‌ అందరూ బయటకు వస్తున్నారు. అయితే ఇది స్టార్స్‌కు సమస్యగా మారుతుంది. ఏంటంటే, డేట్స్‌ విషయంలో క్లాష్‌ ఏర్పడుతుంది. అలాంటి సమస్యే తమన్నాకు క్రియేట్‌ అయ్యింది. దీంతో తను ముందుగానే కమిట్‌ అయిన సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది.

తమన్నా ఆ నిర్ణయమెందుకు తీసుకుంది..?

అందుకోసం రీసెంట్‌గా కమిట్‌ అయిన ఒకట్రెండు సినిమాలనుండి తప్పుకోక తప్పలేదు. అలా తమన్నా నో చెప్పిసిన సినిమాల్లో 'గుర్తుందా శీతాకాలం' సినిమా కూడా ఉంది. సత్యదేవ్‌ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేశారు. కన్నడ చిత్రం 'లవ్‌ మాక్‌టైల్‌' చిత్రానికి ఇది రీమేక్‌. తను డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని, మరో హీరోయిన్‌ను చూసుకోమని తమన్నా చెప్పడంతో నిర్మాతలు కూడా ఏం చేయాలో పాలుపోక, సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగకతప్పదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.