జాక్స్‌ను చాలా బాధపెట్టా.. వాడు ఇకలేడు: పూరీ

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

మనం ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులు చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. పెంపుడు కుక్క అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లప్పటి నుంచి దాన్ని పెంచి పోషించి కుటుంబంలో ఒక్కరుగా భావించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అదే కుక్క చనిపోతే కుటుంబంలో సభ్యుడ్ని కోల్పోయినంత బాధ ఉంటుంది.! అలాంటి ఘటనే టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో చోటుచేసుకుంది. తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా ఉంటున్న కుక్క చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుపెట్టుకుంది!. పూరీ జగన్ తన బాధను ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ రూపంలో తెలిపారు.

పూరీ ట్వీట్ సారాంశం..

వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకానొక టైమ్‌లో వీడిని పెంచే పరిస్థితి లేక ఫ్రెండ్‌కు ఇచ్చేశాను. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పట్నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. నా దగ్గరికి రాడు.. నా వైపు చూడడు. తోక కూడా ఊపి ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యింది.

నేను లైఫ్‌లో ఎంతో బాధపెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధపెట్టాను. వాడు ఇంక లేడు. నేడు వాడికి చివరి రోజు అని బాధతో పూరీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఒకప్పటి జాక్స్ ఫొటో.. మృతి చెందిన తర్వాత పూలదండలతో ఉన్న జాక్స్ ఫొటోను జత చేశాడు. పూరీ ట్వీట్‌‌కు ఆయన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

More News

నా జీవితంలో మర్చిపోలేని హిట్ 'మజిలీ'..ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: నాగ చైతన్య

నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా 'మజిలీ'.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్.  

'చిత్ర‌ల‌హ‌రి' కి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభినంద‌న‌లు

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌

రోడ్డు ప్రమాదంలో తెలుగు ఆర్టిస్ట్‌ల దుర్మరణం

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు మరణించగా..

జూన్‌లో రానా, సాయిప‌ల్ల‌వి 'విరాట ప‌ర్వం'

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే న‌టుడే రానా ద‌గ్గుబాటి. తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం రానా, సాయిప‌ల్ల‌వి క‌లిసి వేణు ఊడుగుల

'వాల్మీకి' లాంగ్ షెడ్యూల్‌

ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు.