'అనగనగా ఓ ప్రేమకథ' తొలి పాట విడుదల చేసిన పూరి జగన్నాధ్

  • IndiaGlitz, [Wednesday,September 26 2018]

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ నిన్ను విడవను లే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేసారు.

డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజు గారితో అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి కి పని చేశాను మళ్ళీ అయన తో సినిమా చేయాలనుకున్న కానీ రాజు గారు ఇతర బిజినెస్ లలో లో బిజీ అయి పోయారు. మళ్ళీ చాల రోజులు తరవాత 'అనగనగ ఓ ప్రేమకథ' అనే సినిమా ని నిర్మించారు నాకు చాల ఆనందంగా ఉంది.

మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు , మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న అని మాట్లాడారు .

తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

More News

పీరియాడిక్ మూవీలో అఖిల్ హీరోయిన్‌..

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

తెలుగు మార్కెట్‌ పై లుక్కేసిన‌ హిందీ స్టార్స్‌

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు.

స్వంత డ‌బ్బింగ్ చెప్పుకోనున్న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్  మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'యాత్ర'. ఆంధ్రప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు

స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాల‌న్‌, రానా ద‌గ్గుబాటి, సుమంత్ స‌హా స్టార్ తారాగ‌ణం

క్షేమంగా చేరుకున్న కార్తీ...

కార్తీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌ల‌యిక‌లో 'ఖాకి' త‌ర్వాత రూపొందుతున్న చిత్రం 'దేవ్‌'.