పూరి జగన్నాథ్ 'రోగ్ ' లో హీరోయిన్స్ డబుల్ ధమాకా

  • IndiaGlitz, [Saturday,February 18 2017]

'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.
అనుష్క, అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ద్వారా డబుల్‌ ధమాకాగా ఇద్దరు హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్లామర్‌గా చూపించే పూరి ఈ సినిమా కాస్త డోస్‌ పెంచి ఇద్దరు హీరోయిన్లతో కనువిందు చేయబోతున్నారు.
'రోగ్‌' అనే డిఫరెంట్‌ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరి డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచుతున్నారు. 'రోగ్‌' మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ మన్నారా చోప్రా, ఏంజెలా స్టిల్స్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More News

స్వాతి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది...

కలర్స్ స్వాతిగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి తర్వాత హీరోయిన్ గా

హీరోయిన్ కిడ్నాప్ , లైంగిక వేధింపులు...

ఒంటరి,మహాత్మ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళం,కన్నడ,మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్ భావన అందరికీ గుర్తుండే ఉంటుంది.

భారతీయులందరూ తప్పక చూడాల్సిన గొప్ప భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' - కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు

అక్కినేని నాగార్జున..హాథీరామ్ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

రజనీకాంత్ అప్పుడే రెడీ అయిపోతున్నాడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డి.జె.దువ్వాడ జగన్నాథమ్ ' ఫస్ట్ లుక్ రిలీజ్

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`,`సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా,