‘పుష్ప’రాజ్ విజువల్‌గా కనిపించబోతున్నాడు..

  • IndiaGlitz, [Saturday,April 03 2021]

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఊరమాస్‌ గెటప్‌లో దర్శనమివ్వనున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించబోతున్నారు. బన్నీ పాత్ర పేరే పుష్పరాజ్‌. ఈ పాన్ ఇండియా మూవీని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా టాలీవుడ్‌లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తోంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి ఇప్పటి వరకూ ఫస్ట్‌లుక్‌‌, రిలీజ్‌ డేట్‌ పోస్టర్లు మినహా.. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌నూ చిత్రబృందం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో సినిమా అప్‌డేట్ ఎప్పుడు విడుదల చేస్తారా? అనే కుతూహలం అభిమానుల్లో మరింత ఎక్కువైంది. తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను వదిలేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సైతం చిత్రబృందం విడుదల చేసింది.

బన్నీ పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ అప్‌డేట్ విడుదల కానుంది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. జాతీయ అవార్డు గ్ర‌హీత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. బన్నీ-సుక్కు కాంటోలో రాబోతున్న ఈ మూడవ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ని ఓ ఆట ఆడుకున్న ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.

సినీ రంగ ప్రవేశం చేసిన వీరప్పన్ కుమార్తె..

ఎర్ర చందనం స్మగ్లర్‌ వీరప్పన్‌.. చనిపోయి ఏడేళ్లవుతున్నా ఆయనను మాత్రం ఎవరూ మరచిపోలేరు.

మరోసారి ప్రభుత్వంపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు.

ఉబర్‌కు షాక్.. రూ.8 కోట్ల జరిమానా

ఉబర్‌కు భారీ షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

'వివాహ భోజనంబు'లో రెండో పాట 'వాట్ ఏ మ్యాన్...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.