వెంకీమామ‌లో రాశీ రోల్ ఇదే!

  • IndiaGlitz, [Sunday,July 21 2019]

వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం 'వెంకీమామ‌'. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తోంది రాశీ ఖ‌న్నా. ఈ సినిమాలో ఆమె లుక్ గురించి రాశీ రివీల్ చేసింది. ''మ‌న‌సులో ఏం అనుకుంటే అది బ‌య‌ట‌కు చెప్పేసే పాత్ర చేస్తున్నా. చాలా స‌ర‌దాగా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ ఫిల్మ్ మేక‌ర్‌గా క‌నిపిస్తాను. ఉమెర్ చిక్‌గా, మ‌రింత మోడ్ర‌న్‌గా క‌నిపిస్తా. నా లుక్ చూసి అంద‌రూ స‌ర్‌ప్రైజ్ అవుతారు.

ఏ ప్రాజెక్ట్ కైనా ప్రాణం పెట్టి ప‌నిచేస్తా. నా ప్రొఫెష‌న‌లిజం ఈ సినిమాలో మ‌రొక్క‌సారి క‌నిపిస్తుంది. అంద‌రికీ న‌చ్చే విధంగా బాబీ తీస్తున్నారు. వెంకీగారు, చైతూగారు ఫ్యాన్స్ కి ట్రీట్ అవుతుంది'' అని అన్నారు. ఈ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ టీచ‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే కొన్ని పోస్ట‌ర్లు కూడా విడుద‌ల‌య్యాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. 'ప్రేమ‌మ్'లో నాగ‌చైత్య‌న‌కు మామ‌గా క‌నిపించారు వెంకీ. తాజాగా ఇద్దరూ క‌లిసి చేస్తున్నారు. ఇలా వీరిద్ద‌రూ క‌లిసి చేయ‌డం ఇదే తొలిసారి.

More News

మిస్ట‌ర్ కెకె అక్క‌డ బ్యాన్‌

విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో, అభి హాస‌న్‌, అక్ష‌రా హాస‌న్ జంట‌గా న‌టించిన సినిమా `మిస్ట‌ర్ కెకె`. క‌డార‌మ్ కొండాన్ అనే త‌మిళ సినిమాకు అనువాద‌మిది.

వ‌ర్మ‌ని పిచ్చోడిని చేసిందెవ‌రు?

స్వ‌త‌హాగా నేను పిచ్చోడిని కాదు. కానీ న‌న్ను ఇద్ద‌రు పిచ్చోడిని చేశారు. వారిద్ద‌రూ చేసిన సినిమా చూశాక నేను ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నా అని అంటున్నారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు! - 'నిను వీడని నీడను నేనే' థాంక్యూ మీట్‌లో ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక.

'2 అవ‌ర్స్ ల‌వ్‌' ట్రైల‌ర్ విడుద‌ల

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`.

అమెజాన్ బ్లండర్ మిస్టేక్.. పండగ చేసుకున్న కస్టమర్స్!

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ చిన్నపొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ చిన్నపాటి తప్పిదం వల్ల అమెజాన్ లక్షలాది రూపాయలు నష్టపోగా..