‘రాధేశ్యామ్’ షూటింగ్ అక్క‌డేన‌ట‌!!

  • IndiaGlitz, [Sunday,August 30 2020]

‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్ మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ సెట్స్‌పై ఉంది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. ఇదంతా బావుంది కానీ.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఓ సందేహం తీర‌డం లేదు. ఎందుకంటే ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎక్క‌డ స్టార్ట్ అవుతుంద‌ని. యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ప్ర‌భాస్ అండ్ టీం క‌రోనా ఎఫెక్ట్‌తో ఇండియా చేరుకుంది. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ‘రాధేశ్యామ్’ కోసం రెండు భారీ సెట్స్ కూడా వేశారు. అయితే ఈ మ‌ధ్య ప్ర‌భాస్ అండ్ టీమ్ పారిన్ వెళుతున్నారంటూ వార్త‌లు వినిపించాయి. దీంతోనే అభిమానుల‌కు గంద‌ర‌గోళం నెల‌కొంది. అసలు ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎక్కడ మొద‌లెడ‌తాడ‌ని.. తాజా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ అండ్ టీమ్ ఇటలీకి వెళుతున్నార‌ట‌.

‘రాధేశ్యామ్’ను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ఈ పీరియాడిక్ ల‌వ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ నిర్మిస్తున్నాయి.

More News

ఆయనో ప్రపంచ మేధావి: శశిథరూర్

తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు చేపట్టారు.

నాని గురించి నేనిప్పుడు చెప్పకూడదు: నివేదా థామస్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైద‌రిల‌తో

కొండపల్లి బొమ్మల గురించి ‘మనసులో మాట’లో చెప్పిన మోదీ

కొండపల్లి బొమ్మల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం మాట్లాడుతూ..

మ‌హేశ్ కొత్త వ్యాపారం...!!

హీరోగానే కాదు.. నిర్మాత‌గా, ఎంటర్ ప్రెన్యూర‌ర్‌గా మ‌హేశ్ నేటి త‌రం హీరోల్లో త‌న‌దైన స్టైల్లో దూసుకెళ్తున్నారు.

అన్‌లాక్-4 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.