close
Choose your channels

అన్‌లాక్-4 మార్గదర్శకాలివే..

Saturday, August 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 30 వరకూ ఇవి అమల్లో ఉంటాయి. కేంద్రం మరికొన్ని సడలింపులు నూతనంగా ఇచ్చింది. అయితే పాఠశాలలు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సైతం అనుమతి నిరాకరించారు.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. అయితే కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాల్క్ మూసే ఉంటాయి. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్‌ కొనసాగేందుకు, ప్రోత్సహించేందుకు అనుమతి లభించింది. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అలాగే 21 నుంచి క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 100 మందికి మించి హాజరు కాకూడదని నిబంధన విధించింది.

సినిమా హాళ్లు (ఓపెన్ ఎయిర్ థియేటర్లు మినహా), స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు మూసే ఉంటాయి. అంతర్ రాష్ట్ర రవాణాకు సైతం అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి నిరాకరించారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. నిత్యావసర కార్యకలాపాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే, 65 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఆరోగ్య అవసరాలకు మినహాయిస్తే ఇళ్లలోనే ఉండాలని సూచించిది. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.