ఈ సమయంలో కూడా ఇలానా..? రివ్యూవర్స్‌పై రఘు కుంచె ఫైర్

కరోనా కారణంగా ఒకరకంగా ప్రపంచమే స్తంభించిపోయింది. దీనిలో భాగంగానే సినీ పరిశ్రమ కూడా మొత్తంగా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్‌లతో పాటు.. రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో రివ్యూలు రాసే వారికి పని లేకుండా పోయింది. పరిస్థితులు ఎప్పుడు సర్దుకుంటాయో.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. దీంతో సినీ పరిశ్రమ్ డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో మళ్లీ రివ్యూలు రాసేవారికి చేతినిండా పని దొరికింది. తాజాగా వీరిపై ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

రఘు కుంచె  మరో ముగ్గురు మిత్రులతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన 47డేస్ సినిమా జీ5 ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సినిమాపై కొందరు రివ్యూవర్స్ నెగిటివ్ కామెంట్స్ గుప్పించారు. ఈ సినిమా వెండితెరపై విడుదలైతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదంటూ ప్రేక్షకుల తరుఫున కూడా తీర్పిచ్చేశారు. దీనిపై స్పందించిన రఘు కుంచె.. తాము కష్టపడి సినిమాలు తీస్తామని.. కొందరు బాల మేధావులు సినిమా బాగోలేదని రాస్తున్నారన్నారు. సినిమాపై సాధారణ ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా ఉన్నారని.. సినిమా గురించి కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు.  సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభములో ఉన్న ఈ సమయంలో తమను ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుందన్నారు. సినిమా గురించి ఏం రాసినా తాము చూస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు. మనసు పెట్టి ఆలోచించాలని రఘు కుంచె సూచించారు.

More News

మహేష్‌ను సౌత్ ఇండియాలోనే టాప్‌లో నిలిపిన అభిమానులు

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకి ప్రత్యేక స్థానముంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

చైనాకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న భారత్

భారత్.. చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఒక్కొక్క దానిపై నిషేధం విధిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది.

వైష్ణ‌వ్ నెక్ట్స్ కూడా డెబ్యూ డైరెక్ట‌ర్‌తోనే..!!

మెగా క్యాంప్ హీరో సాయ‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ పంజా కూడా ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘నేటి చరిత్ర’ కరోనా సాంగ్ లాంచ్

పింక్స్ అండ్ బ్లూస్ (బ్యూటీ సె లూన్ అండ్ స్పా) సమర్పణలో  కరోనా పై  ఆళ్ళ రాంబాబు నటిస్తూ రూపొందించిన ‘నేటి చరిత్ర’ గీతం విడుదలైంది.

మరోసారి చై, సామ్ జోడీ..?

నాగ‌చైత‌న్య‌, సమంత జోడీ మ‌రోసారి స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.