నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం..

  • IndiaGlitz, [Monday,January 07 2019]

ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై మరో లెడీ డైరెక్టర్ ని సినిమా రంగానికి పరిచయం చెస్తున్నారు. అందులో తన కుమారుడు శివ కందుకూరి హీరోగా కనిపించబోతున్నారు. శివ కందుకూరి అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు.

ఇంతకు ముందు ప్రముఖ దర్శకులు సుకుమార్ మరియు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెసిన శేష సింధు రావ్ ని ఈ చిత్రంతో దర్శకురాలుగా రాజ్ కందుకూరి పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గొపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన 96 చిత్రం ఫెం వర్ష ఇందులొ కధానాయికగా పరిచయం అవుతున్నారు.

మహానటి చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్ ఈ చిత్రనికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రవితేజ గిరజాల ఈ చిత్రానికి ఎడిటర్. వేద రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురెష్ బాబు మరియు మధుర శ్రీధర్ లు ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పొషిస్తున్నారు.

More News

నాకు విన‌ప‌డుతుంద‌య్యా..!

ఇది హై క‌మాండ్ తీసుకున్న నిర్ణ‌యం రెడ్డి.. యు హేవ్ టు ఓబే పార్టీ ఆర్డ‌ర్స్‌

శ్రీదేవి బయోపిక్‌కి బోనీ నిర్మాత

జాతీయ స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు అందాల తార శ్రీదేవి. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీలోనూ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా చనిపోవడం అందర్నీ బాధించింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి

76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి ప్రారంభమైంది. సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. హాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

మాజీ ప్ర‌ధానికి ఊర‌ట‌

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది.

అక్కడ రాశి హవా!

తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈమధ్య ఆమె నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి.