డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

‘ఉయ్యాలా జంపాలా’, 'సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్. త‌న గత చిత్రాలు ‘రంగులరాట్నం’, ‘రాజుగాడు’ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌దుప‌రి చిత్రం 'ల‌వ‌ర్' పైనే ఆశ‌లు పెట్టుకున్నారు ఈ యంగ్ హీరో. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో రిద్ధి కుమార్ కథానాయికగా న‌టించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా.. రాజ్ తరుణ్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

కాగా.. ఈ సినిమాకి అంకిత్ తివారి, ఆర్కో, రిషిరిచ్, అజయ్ వాస్, సాయి కార్తీక్, తనిష్క్ బాగ్చి.. ఇలా ఐదు మంది సంగీత ద‌ర్శ‌కులు సంగీతం అందించడం విశేషం. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంతవరకు ‘దిల్’ రాజు నిర్మాణంలో తొలిసారిగా నటించిన హీరోలందరూ సింహభాగం విజయాన్ని అందుకున్నవారే. మరి విజయం కోసం తపిస్తున్న రాజ్ తరుణ్ కూడా విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

More News

'శైలజా రెడ్డి అల్లుడు' ఫ‌స్ట్ లుక్ డిటైల్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు).

మహేష్ చిత్రంలో 'అల్లరి' నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

400 థియేటర్స్‌ కు పైగా విడులదవుతున్న 'యుద్ధభూమి'

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం '1971 బియాండ్‌ బార్డర్స్‌'. 1971లో భారత్‌'పాక్‌  సరిహద్దుల్లో జరిగిన వార్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

నవ్వించడానికి సిద్ధమవుతున్న బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్

పోలీస్‌నేపథ్యంలో జరిగే కథ ఇలాగే వుండాలి అని అందరూ అనుకుంటున్న ఫార్ములాను మా చిత్రం బ్రేక్ చేస్తుంది. అంటున్నారు నిర్మాత మహంకాళి శ్రీనివాసులు.

ర‌వితేజ‌తో మ‌రోసారి..

'ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు' చిత్రాల‌తో ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ప‌ల‌క‌రించిన మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో