రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.8' పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జూన్‌ 19 ఉదయం 8.30 గంటలకు జరిగాయి.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''అధినేత'. 'ఏమైంది ఈవేళ'. 'బెంగాల్‌ టైగర్‌', 'పంతం' వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ - ''మూడు సంవత్సరాల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. 'గుండెజారి గల్లంతయ్యిందే' కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ రాధామోహన్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్‌: రాజ్‌కుమార్‌, కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, మేకప్‌: శివ, కాస్ట్యూమ్స్‌: నాగులు, స్టిల్స్‌: ఆనంద్‌, పబ్లిసిటీ: ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

More News

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు నిలిపివేత‌..?

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గ‌వా?  ఎన్నిక‌ల‌ను నిలిపేస్తారా? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆర్టిస్టుల మ‌ధ్య ఇదే టాపిక్‌.

అమ‌ల‌ను పొగుడుతున్న స‌మంత‌

హెడ్డింగ్ చూసి త‌న అత్త‌గారు అమ‌ల‌ను స‌మంత పొగుడుతుందా?  అని అనుకుంటున్నామో. అలా అనుకుంటే త‌ప్పులో బుర్రేసిన‌ట్టే .

బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

బాల‌య్య స‌ర‌స‌న శ్రియ అన‌గానే అంద‌రికీ వారు గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తుకొస్తాయి.

'సాయిధ‌ర‌మ్ తేజ్‌' తాజా ప్ర‌స్థానం..

`ప్ర‌స్థానం` అనే సినిమాకు తెలుగు సినిమా హిస్ట‌రీలో త‌ప్ప‌కుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా.

సెన్సార్ కార్యక్రమాల్లో 'దర్పణం'

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..