'సాయిధరమ్ తేజ్' తాజా ప్రస్థానం..
Send us your feedback to audioarticles@vaarta.com
`ప్రస్థానం` అనే సినిమాకు తెలుగు సినిమా హిస్టరీలో తప్పకుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు దేవాకట్టా. ఆ తర్వాత కూడా కొన్ని అటెంప్ట్ లు చేసినా, సరైన సక్సెస్ను చవి చూడలేకపోతున్నారు. ఈ దర్శకుడు తన పాత సెన్సిటివిటీస్ని, యథార్థ ఘటనలను సమాహారం చేసుకుని ఓ కథను సిద్ధం చేసుకుని, ఇటీవల సాయిధరమ్తేజ్కు వినిపించారట.
ఈ కథ నచ్చడంతో తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ కథ పూర్తిగ సీరియస్ మోడ్లో ఉండే యాక్షన్ డ్రామా అని వినికిడి. లీలగా లైన్ విని ఓకే చెప్పిన తేజ్ త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని అన్నారట. ప్రస్తుతం దేవాకట్టా ఆ పనిమీదే ఉన్నారు. ఈ మధ్యనే `చిత్రలహరి`తో ఫర్వాలేదనిపించుకున్న సాయిధరమ్తేజ్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.