ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న'రాజా చెయ్యి వేస్తే'

  • IndiaGlitz, [Monday,April 11 2016]
బాణం సినిమా నుండి నేటి వ‌ర‌కు ప్ర‌తి సినిమాను డిఫ‌రెంట్‌గా చేస్తూ త‌న ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రాజా చెయ్యి వేస్తే'. ఈగ', అందాల రాక్షసి','లెజండ్', ఊహలు గుసగుసలాడే', దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు.
ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. అల్రెడి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ఇటీవ‌ల యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆడియో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌లైన సంగతి తెలిసిందే. సాయికార్తీక్ అందించిన ఈసినిమా పాట‌ల‌కు మంచి ఆడియెన్స్ నుండి మంచి స్సంద‌న వ‌చ్చింది. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్పాన్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏఫ్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామ‌ని వారాహి చల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి తెలియ‌జేశారు. నారా రోహిత్ ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్‌ఫార్మెన్స్‌, నంద‌మూరి తార‌క‌ర‌త్న టెరిఫిక్ విల‌నిజం ఆడియెన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయ‌ని చిత్ర‌యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

More News

ఈ నెలలోనే పవన్ సినిమాకు ముహుర్తమా?

ఏంటి పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కదా రిలీజైంది.అప్పుడు మరో మూవీ చేయడమేంటని అనుకునేరు.

మైత్రీ మూవీ మేకర్స్ కి షాకిచ్చిన పవన్, త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమాని నిర్మించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

దేవిశ్రీకి తప్పలేదు

అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావన్నది. ముఖ్యంగా మెగాహీరోలతో చేసినవి. ఇది 'సర్దార్ గబ్బర్సింగ్' విషయంలో మరోసారి రుజువైంది.

ఆర్ధిక ఇబ్బందుల్లో పవన్...రాజకీయాల గురించి...

ఏమిటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉనాడా?అవునండీ..

సమంతను వెళ్లకుండా ఆపేసిన మహేష్....

ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న సమంత,హీరో సూర్యతో కలిసి నటించిన చిత్రం 24.