కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. వెంటిలేటర్ తొలగింపు

  • IndiaGlitz, [Friday,October 30 2020]

కరోనా నుంచి హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. నేడు ఆయనకు వెంటిలేటర్‌ను సైతం వైద్యులు తొలిగించారు. తమ కుటుంబం కరోనా బారిన పడిందని.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామంటూ రాజశేఖర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కూతుళ్లు కోలుకున్నారని తాను, జీవిత మాత్రం చికిత్స పొందుతున్నామని రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడించిన కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది.

ఒకరోజు సడెన్‌గా రాజశేఖర్ కూతురు శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని శివాత్మిక పేర్కొంది.

కాగా.. రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారడంతో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా.. నేడు వెంటిలేటర్‌ను తొలగించడమనేది శుభ పరిణామం. త్వరలో ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

More News

అక్కడ కరోనా రెండో దశ ప్రారంభం.. తెలంగాణలో అధికారుల అప్రమత్తం..

కరోనా ప్రభావంతో పాటు భయం కూడా జనాల్లో బాగా తగ్గిపోయింది. జనజీవనం అంతా యథాతథ స్థితికి వచ్చేసింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా భట్‌ పాట

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు..

భారతదేశంలో ఇటీవలే ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

మూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

కొవ్వూరి సురేష్‌రెడ్డి... యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే.

టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..