ఫ్యాన్స్.. పవన్ చెప్పిందే నిజమని నమ్మితే..: రవితేజ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఊహించని రీతిలో భారీ షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. పవన్‌ అత్యంత సన్నిహితుడు.. పవన్ కు రైట్ హ్యాండ్ అనే రీతిలో పార్టీ వర్గాల్లో రాజు రవితేజకు గుర్తింపు ఉంది. జనసేన పార్టీ పెట్టడానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి రాజు రవితేజ్‌ పార్టీకీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా.. మీడియా వేదికగా జనసేన.. ఆ పార్టీ అధినేత తీరుతెన్నులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో తన వ్యాఖ్యలతో హీట్ పుట్టించిన రవితేజ తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తనపై ప్రభావం చూపించే వ్యక్తులను పార్టీ నుంచి పవనే బైటికి నెట్టేస్తారని, పార్టీలో అన్ని వ్యవహారాలు తన గుప్పిట్లో ఉండాలని ప్రయత్నిస్తారని ఆయన ఆరోపించారు.

అన్నీ పవనే.. మా సంగతేంటి!?

‘జనసేన పార్టీలో కెప్టెన్ ఆయనే.. ఆయనే బ్యాట్స్ మన్.. ఆయనే బౌలర్.. ఆయనే ఫీల్డర్.. చివరికి ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. అయితే.. ఎవరైనా బాగా ఆడుతుంటే వాళ్లను కావాలనే రనౌట్ చేసే వ్యక్తి పవన్. జనసేన పార్టీని చాలామంది వీడడానికి కారణమిదే. నాకు తెలిసినంతవరకు పవన్‌కు కులం, మతంపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులం, మతాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న తీరే చాలా ప్రమాదకరం’ అని రవితేజ వ్యాఖ్యానించారు.

బీజేపీకి దగ్గర కావాలని..!

‘పవన్ ఇటీవల బీజేపీ, మోదీ, అమిత్ షా అనుకూల వ్యాఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీకి దగ్గరకావాలని పవన్ సంకేతాలు ఇస్తున్నారు. కానీ రైట్ సైడ్ చూపించి లెఫ్ట్ సైడ్ వెళతారా? స్ట్రెయిట్‌గా వెళతారా? ఎవరికీ తెలియదు. ప్రజలకు సేవలందించాల్సిన పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత వివాదాలను మాట్లాడి పార్టీలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన కోపం, ద్వేషంతో పవన్ చేసిన ప్రసంగాల కారణంగా నిజమైన మద్దతుదారులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇతర పార్టీల వారికంటే సొంత పార్టీ వాళ్లే పవన్‌ను ఎక్కువగా ద్వేషిస్తుంటారు. పవన్ వైఖరిని ఈ మధ్య బాగా గమనిస్తే.. సమస్య లేని చోట సమస్యను సృష్టించే విధంగా తయారయ్యాడు. కులం పేరిట పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అమాయకులైన అభిమానుల్లో తప్పుడు బీజాలు నాటుతున్నాయి. పవన్ చెప్పిందే నిజమని అభిమానులు నమ్మితే జరిగే పరిణామాలకు బాధ్యులెవరు..?’ అని ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర స్థాయిలో రవితేజ ధ్వజమెత్తారు. కాగా.. పవన్ కల్యాణ్ సమాజానికి ప్రమాదకరమని చెబుతూ.. ఆయనలో విషపూరిత ఆలోచనలు, ప్రతీకార ధోరణి బలంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి నాయకుడ్ని అధికారం చేపట్టకుండా ఆపాలని రాజు రవితేజ పిలుపునిచ్చిన విషయం విదితమే.

More News

నన్ను అవమానించాడు.. 'అమ్మరాజ్యం' ప్లాప్: పాల్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అనేక వివాదాలు.. మరెన్నీ కోర్టు చీత్కారల నడుమ ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకున్న సంగతి తెలిసిందే.

జనసేనకు భవిష్యత్ లేదు.. పవన్‌కు...: రాపాక సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. ఆ పార్టీ తరఫున పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.

అయేషా తల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా రియాక్షన్...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దీంతో విచారణ మరింత వేగవంతమైంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు

అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి

గోపీచంద్‌ - సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3 గా శ్రీనివాసా