close
Choose your channels

నేడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకానున్న రకుల్

Friday, September 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకానున్న రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక్క బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో స్టార్ హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎన్సీబీ నోటీసులు అందుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు విచారణకు హాజరు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రకుల్ ముంబై చేరుకుంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి, రకుల్‌కు మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉండటంతో పాటు.. ఇద్దరూ కలిసి డ్రగ్స్ వాడారన్న అనుమానాలు ఉండటంతో ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది.

నిజానికి ఎన్సీబీ ఇచ్చిన సమన్ల ప్రకారం రకుల్ నిన్ననే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు సమన్లు అందలేదని.. అందుకే హాజరు కావడం లేదని రకుల్ లీగల్ టీం వెల్లడించింది. దీంతో ఎన్సీబీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో రకుల్ గత రాత్రి ముంబై చేరుకుంది. మరోవైపు ఇప్పటికే రకుల్‌ను అడగాల్సిన ప్రశ్నల జాబితాను ఎన్సీబీ సిద్ధం చేసినట్టు సమాచారం. మరి ఈ విచారణలో రకుల్ ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు రకుల్‌తో పాటు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు కూడా ఎన్సీబీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. వీరందరినీ విచారించేందుకు ఎన్సీబీ అధికారులు అన్ని ఏర్పాట్లనూ చేస్తున్నారు. దీపిక విషయానికి వస్తే రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీపిక మేనేజర్‌ను మాత్రం నేడే ఎన్సీబీ అధికారులు ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం దీపిక కోసం ఎన్సీబీ అధికారులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. రేపు సారా, శ్రద్ధా కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.