డ‌బ్బింగ్ ప‌నిలో బిజీ అయిపోయిన చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Tuesday,March 06 2018]

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా 'రంగస్థలం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1985నాటి పరిస్థితులకు అద్దం పడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంది ఈ మూవీ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా వుంటే.. ఈ సినిమాలో చరణ్ బ‌ధిరుడి పాత్రను పోషించిన సంగ‌తి తెలిసిందే.

అంతేగాకుండా, తన పాత్రనుగుణంగా కామెడీని కూడా బాగా పండించారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో తెలుస్తోంది. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం డబ్బింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. గోదావరి యాసతో మాట్లాడడానికి చరణ్ బాగానే హోం వర్క్ చేశారనీ.. ప్ర‌స్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో ఆయ‌న బిజీగా ఉన్నారని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్ర‌కాష్ రాజ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. అలాగే పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

More News

ఆ దర్శకుడితో బన్నీ మరోసారి..?

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో యువ కథానాయకుడు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు.

'తారామణి' మొదటి పాటను విడుదల చేసిన శ్రీలేఖ

అంజలి,ఆండ్రియా,వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తారామణి'.

పతిఘటన, నేటిభారతం తరహాలో... తారానీలు కార్పొరేషన్ చిత్రం

తారానీలు కార్పొరేషన్ పతాకంపై అనురాగ్(ఎమ్.ఎస్.బాబు) స్వీయ దర్శకత్వంలో

కిడ్నాపింగ్ డ్రామాతో శ్రీనివాస్ చిత్రం?

బెల్లంకొండ శ్రీనివాస్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'.

మోహన్ లాల్ లాంచ్ చేసిన 'యుద్ధ భూమి' ట్రైలర్

ఇండో-పాక్ బోర్డర్ లో 1971లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మలయాళంలో రూపొందిన చిత్రం'1971 బియాండ్ బోర్డర్స్'.