ఈరోజు నుండి రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ స్టార్ట్

  • IndiaGlitz, [Sunday,April 02 2017]

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌రణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ఫై ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు(ఏప్రిల్‌2) నుండి రాజ‌మండ్రిలో ప్రారంభం అవుతుంది. రీసెంట్‌గా ధృవ చిత్రంతో మ‌రో సెన్సేష‌న‌ల్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న రామ్‌చ‌ర‌ణ్‌తో క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ సినిమా అన‌గానే సినిమా ఇటు ప్రేక్ష‌కుల్లో , అటు అభిమానుల్లో ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన అన్ కాంప్ర‌మైజ్‌డ్ ప్రొడ్యూస‌ర్స్ న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) ఈ సినిమాను రూపొందిస్తుండ‌టంతో సినిమా ఎంత భారీ రేంజ్‌లో రానుందోన‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి.

రాజ‌మండ్రి ద‌గ్గ‌ర ఓ గ్రామంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య పెద్ద షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. యూనిక్ స్క్రిప్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ చేయ‌న‌టువంటి స‌రికొత్త గెట‌ప్, లుక్‌తో ఈ చిత్రంలో క‌న‌ప‌డనున్నాడు. చ‌ర‌ణ్ లుక్ డిఫ‌రెంట్‌గా, స్ట‌యిలిష్‌గా ఉండేలా సుకుమార్ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే కాకుండా స్పెష‌ల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో చ‌ర‌ణ్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయిస్తున్నారు. సినిమాలో హీరో, హీరోయిన్ స‌హా అన్నీ క్యారెక్ట‌ర్స్ కాస్ట్యూమ్స్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్‌. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా, స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. జూలైకంతా సినిమాను పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

More News

చేతన్ చీను హీరోగా భారీ త్రిభాషా చిత్రం

‘రాజుగారి గది’ఫేమ్ చేతన్ చీను హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది.‘సత్యం’ఫేమ్ సూర్యకిరణ్ డైరెక్షన్ లో

'గురు' బాగానే రాబడుతున్నాడు

విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్గా, రితిక సింగ్ శిష్యురాలిగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా `గురు`. తమిళంలో, హిందీలో మాధవన్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సుధ కొంగర దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' మోషన్ పోస్టర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.

కొత్త దర్శకుడుతో బాలయ్య...

గౌతమీపుత్ర శాతకర్ణితో వంద సినిమాలను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

ప్రభుదేవా సినిమాలో విషాదం...

కొరియోగ్రాఫర్,నటుడు,డైరెక్టర్ అయిన ప్రభుదేవా హీరోగా యుంగ్ ముంగ్ సుంగ్ అనే తమిళ సినిమా రూపొందుతోంది.