యంగ్ హీరోల‌తో సినిమాలు నిర్మించే ప్లాన్ లో చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Thursday,November 17 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి నిర్మాత‌గా మారి...కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెం 150 చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఖైదీ నెం 150 త‌ర్వాత చ‌ర‌ణ్ కొణిదెల బ్యాన‌ర్ పై వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇద్ద‌రు యంగ్ హీరోల‌తో సినిమాలు నిర్మించేందుకు క‌థ‌లు వింటున్నాడ‌ట చ‌ర‌ణ్. ఇంత‌కీ ఆ యంగ్ హీరోలు ఎవ‌రో కాదు..అక్కినేని అఖిల్, శ‌ర్వానంద్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు అనేది తెలియాల్సి ఉంది. ఖైదీ నెం 150 త‌ర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండానే ఈ చిత్రాల‌ను ప్రారంభించాలి అనుకుంటున్నాడ‌ని సమాచారం.

More News

2.0 టీమ్ డిఫరెంట్ ఐడియా....

సూపర్స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.

తీసుకున్న లోన్స్ అన్నింటిని క్లియ‌ర్ చేసాం ఇది నిజం - నాగార్జున‌

అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ పేరు మీద బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అయితే... గ‌తంలో నాగ్ తీసుకున్న లోన్స్ క్లియ‌ర్ చేయ‌లేదు..

నితిన్ మూవీలో కొత్త హీరోయిన్..!

యువ హీరో నితిన్ - అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ కోసం శృతిహాస‌న్ ను సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

గాలి పెళ్లిలో డ్యాన్స్ కి ర‌కుల్ అంత తీసుకుందా..!

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమార్తె బ్రాహ్మ‌ణి పెళ్లిని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చేసారు. ఈ పెళ్లికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల‌తో ఈ పెళ్లి జ‌రిగిందట‌.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ పూర్తి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టిస్తుంది. హేమ‌మాలిని బాల‌కృష్ణ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్నారు.