నో చెప్పిన చెర్రీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్!

  • IndiaGlitz, [Sunday,July 14 2019]

ఇదేంటి.. చెర్రీ నో చెప్పడమేంటి..? ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి..? టైటిల్ చూడగానే కాసింత కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ..? మీరు వింటున్నది నిజమే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR చిత్రంలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత మరో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పలు పాత్రలకు ఇప్పటికే సెర్చింగ్ స్టార్ట్ చేసిన దర్శకనిర్మాతలు రాముడి పాత్రలో చెర్రీ అయితే కరెక్టుగా సెట్ అవుతారని భావించి సంప్రదించారట. అయితే ఏ మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేశారట. ప్రస్తుతం #RRRలో ఉన్నానని ఆ తర్వాత కూడా బిజిబిజీగా ఉంటానని చెప్పేశారట. మరీ ముఖ్యంగా సినిమాలో పాత్ర అంతే కానీ.. ప్రధాన పాత్ర కాదు కదా అని చెర్రీ నో చెప్పేశారట.

చెర్రీ నో చెప్పడంతో నేరుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు దర్శకనిర్మాతలు వాలిపోయారట. రాముడి పాత్రలో చేయాలని అడిగారట. అంతేకాదు రెండు సీన్లు కూడా చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించకుండా నేను రెడీ.. కాకపోతే ఇప్పటికిప్పుడు కాదు.. #RRR పూర్తయ్యాకనే వస్తానని జూనియర్ చెప్పేశారట. మొత్తానికి చూస్తే చెర్రీ నో చెప్పగా.. ఎన్టీఆర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్న మాట. అయితే ఇది ఎంతవరకు నిజమో..? ఈ పుకార్లు షికార్లు చేస్తూనే నిలిచిపోతాయా..? నిజమవుతాయా..? అనేది తెలియాలంటే అటు జూనియర్ గానీ.. ఇటు ‘రామాయణం’ దర్శకనిర్మాతలుగానీ రియాక్ట్ కావాల్సిందే మరి.

More News

జక్కన్న కాంపౌండ్‌లో అన్నీ హిట్లే.. హిట్లు మరీ ఈ ఇద్దరి సంగతేంటి!

అవును.. జక్కన్న కాంపౌండ్‌లో అడుగుపెట్టారంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి దాదాపు ఉండదు..

లోకేష్‌ 2.0ను చూసి చంద్రబాబు హ్యాపీ.. హ్యాపీ!

ఇదేంటి.. టీడీపీ ఓడిపోయిందిగా.. పైగా కొడుకు కూడా మంగళగిరిలో అట్టర్ ప్లాప్ అయ్యారు.. మరి చంద్రబాబు హ్యాపీగా ఉండటమేంటి..?

పోసాని రియల్ కోరికను వైఎస్ జగన్ నెరవేరుస్తారా!?

టాలీవుడ్ నటుడు కమ్ రచయిత పోసాని కృష్ణ మురళీ వైసీపీకి ఏ రేంజ్‌లో మద్దతిచ్చారో..?

గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....నిర్మాతలు : మధుర శ్రీధర్ మరియు యశ్ రంగినేని

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ బిగ్ బెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘దొరసాని’.

బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన జోగిని శ్యామల

జోగిని శ్యామల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు శ్యామలను పరిచయం చేయనక్కర్లేదు.