రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Thursday,August 13 2020]

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు వేదికపై ఉన్న ఐదుగురు ప్రముఖుల్లో నృత్యగోపాల్ దాస్ ఒకరు.

శ్రీకృష్ణ జన్మాస్టమి సందర్భంగా మధురకు వెళ్లిన ఆయనకు శ్వాసకోశ సమస్యలు రావడంతో వైద్యులు ఆయనను పరీక్షించారు. కోవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. నృత్యగోపాల్‌దాస్‌కు కరోనా సోకిన విష‌యం తెలుసుకున్న‌సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెదాంతకు చెందిన డాక్టర్ త్రెహన్‌తో ఫోన్‌లో మాట్లాడి, నృత్య గోపాల్ దాస్‌కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

More News

కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌కూ సంబంధం లేదు: కుటుంబ సభ్యులు

దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ కారు.. మరొక కారును ఢీకొట్టిందని..

నాని.. చివ‌ర‌కు త‌ప్ప‌ేలాలేదు...!!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం.. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ ఆగిపోవ‌డం ఏక కాలంలో జ‌రిగాయి.

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తమన్..

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమలో సినీ పరివ్రమ ఒకటి. దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు.

తెలంగాణలో తాజాగా 1931 కేసులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు 2000 దాకా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి.

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించారంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.