close
Choose your channels

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

Thursday, August 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా తండ్రి జీవించే ఉన్నారు: ప్రణబ్ కుమారుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరమపదించారంటూ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై ఆయన కుమారుడు, కుమార్తె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి బాగున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు వెల్లడించారు. ‘‘నా తండ్రి శ్రీ ప్రణబ్ ముఖర్జీ జీవించే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సోషల్ మీడియాలో జర్నలిస్టులు సర్క్యులేట్ చేస్తున్న ఊహగానాలు, ఫేక్ న్యూస్ చూస్తుంటే ఇండియా ఫేక్ న్యూస్‌కి ఫ్యాక్టరీగా మారిందేమో అనిపిస్తోంది’’ అని ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రణబ్ ముఖర్జీ పరమపదించారన్న వార్తలపై ఆయన కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కూడా స్పందించారు. ‘‘మా నాన్నగారి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. స్పెషల్‌గా మీడియాకు మా రిక్వెస్ట్.. నాకు ఎవరూ మా నాన్నగారి ఆరోగ్య విషయమై కాల్ చేయవద్దు. నేను ఫోన్‌ను ప్రస్తుతం వాడాలనుకోవడం లేదు’’ అని శర్మిష్టా ట్వీట్ చేశారు.

కాగా.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే చికిత్సానంతరం కూడా ప్రణబ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు మంగళవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా దీనికి ముందు నిర్వహించిన పరీక్షలో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా ప్రణబ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.