కాకినాడలో రామ్ చిత్రం షూటింగ్

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

'సినిమా చూపిస్త మావ‌', ‘నేను లోకల్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్నారు దర్శకుడు త్రినాథ‌రావు నక్కిన. ప్రస్తుతం ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ఈ డైరెక్టర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్, కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, క‌న్న‌డ బ్యూటీ ప్రణీత నాయకానాయికలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం కాకినాడలో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీకరిస్తోంది చిత్ర బృందం.

ఈ షెడ్యూల్‌లో పోసాని కృష్ణ మురళి కూడా పాల్గొన‌బోతున్నారు. గత చిత్రాల మాదిరిగానే తన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాని రూపొందిస్తున్నార‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రామ్ ఎనర్జి కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

పెళ్ళైన మగాళ్ల కష్టాలను అందరికీ తెలిజయజెప్పేలా 'ఐపిసి సెక్షన్ భార్య బంధు'.

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు'.

'సవ్యసాచి' టీజర్ ఎప్పుడంటే..

యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'.

చిరు సరసన రజనీ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

తేజ్ ఐ లవ్ యు ట్రైలర్ విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు

'ఈ న‌గ‌రానికి ఏమైంది?' సెన్సార్ పూర్తి..

'పెళ్ళి చూపులు'తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.