బన్నీకి గ్రీటింగ్ పంపించిన చెర్రీ దంపతులు

కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్‌లో సామాన్యులే కాదు.. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా బారిన పడి తాజాగా కోలుకున్న విషయం తెలిసిందే. పవన్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడి ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బన్నీ కూడా కోలుకోవాలని అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

తాజాగా అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఆయనకు ఒక గ్రీటింగ్ కార్డు పంపించారు. కరోనా నుంచి కోలుకుని బన్నీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ తాజాగా చరణ్‌ దంపతులు ఈ గ్రీటింగ్‌ కార్డును బన్నీకి పంపించారు. ‘ప్రియమైన బన్నీ!! కొవిడ్‌ నుంచి నువ్వు కోలుకుంటున్నావని ఆశిస్తున్నాం. నువ్వు ఆరోగ్యంగా తిరిగి వచ్చిన వెంటనే మనం కలుద్దాం’ అని చెర్రీ ఆ గ్రీటింగ్ కార్డులో పేర్కొన్నాడు. అంతేకాకుండా కొన్ని ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు, పండ్లు ఇతర సామగ్రిని సైతం బన్నీకి కానుకగా చెర్రీ దంపతులు పంపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చరణ్‌ దంపతులకు బన్నీ ధన్యవాదలు తెలిపాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. ఈ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న బన్నీకి ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాబట్టి ఆయన ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక చెర్రీ అటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లోనూ.. ఇటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలోనూ నటిస్తున్నాడు.

More News

బతుకుతాననే ఆశ లేదంటూ పోస్టు పెట్టిన కాసేపటికే నటుడి మృతి..

కరోనా మహమ్మారి జన జీవితాలను ఎంత విచ్ఛిన్నం చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజూ ఎన్నో సంఘటనలను చూస్తూనే ఉన్నాం.

`సింగ‌రాయ్` చిత్రంలోని సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి.

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. చైనా రాకెట్ ముప్పు తప్పింది!

అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే గత కొద్ది రోజులుగా కొత్త భయం ప్రారంభమైంది.

సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.